Kantaara : కాంతార సినిమా దేశవ్యాప్తంగా దుమ్మురేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరి ట్రేడ్ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు ఈ సినిమాపై సోషల్మీడియా వేదికగా తమ ప్రశంసలను తెలియజేశారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా కూడా చేరిపోయింది.
కన్నడ నటుడు రిషబ్శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడిగుల సంప్రదాయమైన భూతకోల ఆచార్యం నేపథ్యంలో తెరకెక్కింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘ఇప్పుడే ఫ్యామిలీతో కలిసి కాంతార సినిమా చూశాను. ఇప్పటికీ నా శరీరం ఇంకా వణుకుతూనే ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం. సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మేళనమే ఈ చిత్రం. రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్. రచన, దర్శకత్వం, నటన.. అన్నీ నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. సినిమాలో ప్రకృతి అందాలను చూపించిన విధానం, యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది’ మరో వారం రోజుల పాటు ఇదే ట్రాన్స్లో.. అంటూ ఈ సినిమా మేకర్స్ను పొగడ్తలతో ముంచెత్తింది.
Kangana Ranaut is all praise for #Kantara after watching the film in theaters.#KanganaRanaut #KantaraMovie pic.twitter.com/Qya9Ghizb3
— Kangana Ranaut Daily (@KanganaDaily) October 20, 2022
కాంతరాకు ఆస్కార్ పక్కా : కంగనా
అంతేకాకుండా సినిమా అంటే ఇలా ఉండాలి. ఇలాంటి చిత్రాన్ని తామెప్పుడూ చూడలేదని థియేటర్లో ప్రేక్షకులు చెబుతున్నారు. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన టీమ్కు ధన్యవాదాలు అని ఆమె రాసుకొచ్చింది. అలాగే ఇంకో పోస్ట్లో వచ్చే ఏడాది కాంతార ఆస్కార్కు నామినేట్ అవ్వడం పక్కా. భవిష్యత్లో ఇంతకన్నా గొప్ప చిత్రాలు రావచ్చుగాని, మన దేశ సంస్కృతిని, అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే ఇలాంటి చిత్రాలను ఆస్కార్కు నామినేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆమె తెలిపింది.
ఇప్పటికే 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా రూ.200 కోట్ల కలెక్షన్లవైపు దూసుకొనిపోతుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ వసూళ్ల పరంగా భారీ సంఖ్యలను నమోదు చేస్తుంది. కేజీఎఫ్ వంటి బ్లాక్బాస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఈ సినిమాలో రిషబ్శెట్టికి జోడీగా సప్తమి గౌడ నటించింది.