కాంతారా సినిమా తెలుగు నాట మరో సూపర్ హిట్ మూవీగా దూసుకుపోతుంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత తెలుగులో ఆ స్థాయిలో ఆదరణని ఈ చిత్రం సొంతం చేసుకుంటుంది. రెండు రోజుల్లోనే ఏకంగా 5 కోట్లకి పైగా కలెక్షన్స్ ని కాంతారా సొంతం చేసుకుందని టాక్. లాంగ్ రన్ లో భారీగా కలెక్షన్స్ రావడం పక్కా అనే మాట వినిపిస్తుంది.అల్లు అరవింద్ ఈ మూవీని పక్కా ప్లాన్ తో రిలీజ్ చేసి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అని ట్రెండ్ పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాంతారా సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ లో చాలా మందికి రంగస్థలం సినిమా గుర్తుకొస్తుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాల ఎపిసోడ్ చూసిన తర్వాత రంగస్థలం సినిమా క్లైమాక్స్ ని గుర్తు చేసుకుంటున్నారు.
ఈ రెండు చిత్రాల క్లైమాక్స్ లు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. చివరి వరకు అందరూ మంచి వ్యక్తి అనుకునే వాడినే విలన్ గా చూపించడం. తన అన్నని చంపినందుకు హీరో అతన్ని చంపడం అనే పాయింట్ రెండు సినిమాలలో కామన్ గా ఉంటుంది. రంగస్థలం సినిమాలో ఈ పాయింట్ సినిమా సక్సెస్ లో చాలా కీలకంగా మారింది. ఇప్పుడు అలాంటి పాయింట్ తోనే వచ్చిన కాంతారా సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తో పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది.
ఈ నేపధ్యంలో రంగస్థలం సినిమాని సుకుమార్ పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ కి రాబట్టేది అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ విషయంలో మైత్రీ నిర్మాతలు తప్పు చేశారని భావిస్తున్నారు. కాంతారా సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసాక నిజంగా ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ ని కేవలం తెలుగుకి మాత్రమే సుకుమార్ పరిమితం చేసాడని బాధపడుతున్నారు. ఏది ఏమైనా కాంతారా హిట్ కారణంగా మరో సారి రంగస్థలం సినిమా వార్తల్లోకి వచ్చింది.