రిషబ్ శెట్టి హీరోగా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన కాంతారా మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక కన్నడ నాట ఏకంగా వంద కోట్లకి పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. సరికొత్త కథాంశంతో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ప్రతి ఒక్కరికి ఈ మూవీ బాగా చేరువ అయ్యింది. ఇక సెలబ్రెటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షంకురిపించారు. చూసిన వారే మళ్ళీ మళ్ళీ చూడాలని అనుకుంటున్నారు. ఇక సెలబ్రెటీలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ బాషలలో కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తెలుగులో అల్లు అరవింద్ ఈ సినిమాని రిలీజ్ చేశారు.
కేవలం రెండు కోట్లకి ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకొని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇక ఊహించని స్థాయిలో మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో ఈ మూవీ దూసుకుపోతుంది. ఇక తెలుగునాట రోజురోజుకి థియేటర్స్ సంఖ్య పెరుగుతుంది. గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్స్ కూడా కాంతారా రిలీజ్ తర్వాత పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. ఇక కాంతారా కలెక్షన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే కన్నడంలో కంటే తెలుగులో మరింత ఎక్కువగా సినిమాకి రెస్పాన్స్ వస్తుంది. కన్నడంలో 17 రోజులలో కలెక్ట్ చేసిన మొత్తం తెలుగులో కేవలం మూడు రోజులలో కలెక్ట్ చేసింది.
ఏకంగా మూడు రోజులలో ఈ సినిమా 20 కోట్లు కాంతారా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కలెక్ట్ చేయడం సినిమాకి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో తెలియజేస్తుంది. ఇక ఈ సినిమాకి తెలుగులో వస్తున్న ఆదరణ పట్ల రిషబ్ శెట్టి కూడా మీడియా ముందుకి వచ్చి థాంక్స్ చెప్పారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ తో చాలా ఆనందంగా ఉందని థాంక్స్ చెప్పారు. ఇక ఈ సక్సెస్ మీట్ లో భాగంగా అల్లు అరవింద్ రిషబ్ పంత్ దర్శకత్వంలో అతనే హీరోగా ఒక సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అది కన్నడంతో పాటు ఇతర బాషలలో కూడా ఉండే అవకాశం ఉంది. ఒక్క డబ్బింగ్ సినిమాతో ఏకంగా గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో సినిమా చేసే అవకాశాన్ని దర్శకుడు రిషబ్ పంత్ సొంతం చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.