తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంలో ప్రతిఒక్కరూ అనర్గళంగా మాట్లాడగలరు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ ఇలా ఎవరైనా సరే మైక్ అందుకున్నారంటే పలు భాషాల్లో తమ స్పీచ్లతో అక్కడున్న వారిని అటెన్షన్ ఈజీగా తమవైపు తిప్పుకుంటారు..
తాజాగా.. మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకన్నాడు. తన ఫస్ట్ పబ్లిక్ స్పీచ్లోనే అదరగొట్టారు. హైదరాబాద్ శివారులోని కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్న హిమాన్షు.. దాన్ని కార్పొరేట్ స్కూల్కు ధీటుగా తీర్చిదిద్దారు. దాదాపు కోటి వెచ్చించి స్కూల్ను పునర్నిర్మించారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా హిమాన్షు రావు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాఠశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా హిమాన్షురావు ఫస్ట్ స్పీచ్తోనే అదరగొట్టారు. “ఇది నా ఫస్ట్ పబ్లిక్ స్పీచ్.. కొంచెం నర్వస్గా ఉన్నా.. నా ఫ్యామిలీ ముందు మాట్లాడుతున్నట్లుంది అని అన్నాడు. గతేడాది నుంచి ఈ స్కూల్కు వస్తున్నా. స్కూల్కు మెుదటిసారి వచ్చినప్పుడు అన్ని సమస్యలే కనిపించాయి. కేసీఆర్ గారి మనుమడిని కదా, ఏదైనా నార్మల్గా చేసే అలవాటు లేదు. నిధులు సేకరించి పేదలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలనుకున్నాం. మా స్కూల్ ప్రొగ్రాంలో భాగంగా ఈ స్కూల్కి గోడలు కట్టించాలి అనుకున్నాం. తొలుత ఇక్కడికి వచ్చినపుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని అన్నాడు.
ఆడపిల్లలకు సరైన వాష్రూంలు లేవు. బయటే పందులు ఉన్నాయి. మెట్లు కూడా సరిగా లేవు. మౌళిక సదుపాయాలు లేవు. ఓ పిల్లాడు జారి కిందపడిపోయాడు. క్లాస్ రూంలోనే ఆఫీస్ రూం ఉంది. అలాంటి పరిస్థితులు నేను ఎప్పుడూ చూడలేదు. ఆ బాధను నేను మాటల్లో చెప్పలేను.స్కూల్ మనకేం ఇచ్చింది కాదు.. స్కూల్కు మనం ఏం ఇచ్చాం అనేది ఇంపార్టెంట్ అనుకున్నా. మా కాలేజీలో రూ. 40 లక్షలు సేకరించాం. ఈ స్కూల్ను నేను ఎంపిక చేసుకోవటానికి మేజర్ ఇన్సిఫిరేషన్ మా తాతగారు. తాను ఎప్పుడూ ఓ మాట చెబుతుండేవారు. చదువుకున్న సమాజం మనకళ్ల చుట్టూ ఉన్న సమస్యలకు ఉపాయాన్ని చెప్పగలదని చెప్పేవారు అని తెలిపాడు. మా తాత గారి ఇన్సిఫిరేషన్ వల్లే ఇవాళ ఈ స్కూల్ కట్టాం అని కేటీఆర్ తనయుడు చెప్పుకొచ్చాడు.