కీర్తి సురేష్.. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటి. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మహానటి సినిమాతో మంచి పేరు సంపాదించింది.
ఇటీవల దసరా సినిమా సక్సెస్ తో మంచి ఊపు మీద ఉంది కీర్తి సురేష్. తల్లితండ్రులిద్దరూ సినీ రంగానికి చెందిన వారు కావడంతో కీర్తి సురేష్(Keerthy Suresh)కి సినీ పరిశ్రమలోకి రావడం చాలా తేలికైంది. తర్వాత తన నటనతో ఆకట్టుకుంది. కీర్తి సురేష్కి సౌత్ ఇండియాలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం సినిమాల్లో కూడా పాపులారిటీ సంపాదించింది.
![కీర్తి సురేష్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎన్ని వందలు? 2 కీర్తి సురేష్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎన్ని వందలు?](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-13.jpg)
కీర్తి సురేష్ :
ప్రస్తుతం పలు తమిళ సినిమాలతో బిజీ ఉంది కీర్తి. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్(Keerthy Suresh Remuneration) తీసుకుంటున్న ఆమెకు మెుదటి పారితోషికం తెలిసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇది విని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తి సురేష్(Keerthy Suresh) ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. నేను శైలజ సినిమాతో ఫేమస్ అయింది. మహానటి సినిమా ఆమె కెరీర్ని మార్చేసింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన కీర్తి సినిమాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం కీర్తి సురేష్ భారీ పారితోషికాన్ని అందుకుంటుంది. ఒక సినిమాకు 1 నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంటున్నారు. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన దసరా సినిమా కోసం 2 కోట్లు తీసుకుంది.
కీర్తి సురేష్ బాలనటిగానూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె మెుదటి పారితోషికం 500 రూపాయలు. ఈ విషయాన్ని తన తండ్రి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది. ‘భోళా శంకర్’లో చిరంజీవి(Chiranjeevi) చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.