పవర్ స్టార్ మేనియా ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్కు పూనకాలే. పవన్ కల్యాణ్– సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో‘ సినిమా జులై 28న విడుదల కాబోతుంది. కానీ ఫ్యాన్స్ ఈ సినిమా కంటే ‘ఓజీ’ మీదే ఎక్కువగా ఏకాగ్రత పెట్టారు. అసలు బ్రో ట్రైలర్ను, రిలీజ్ను కూడా అంతగా పట్టించుకోకుండా సోషల్ మీడియాలో #TheyCallHimOG అంటూ ట్రెండ్ చేస్తున్నారు. దీనికి థమన్ చెప్పిన మాటలు కూడా ఓ కారణమయ్యాయి. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓజీ సినిమా గురించి థమన్ ఇలా అన్నాడు.
“ఓజీ ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా. దాంట్లో ఏమేమి చేయాలో మాకు తెలుసని ,ఆ సినిమా మామూలుగా ఉండదని చెప్పుకొచ్చారు .. . ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ను ఎలా చూడాలో.. వచ్చిన టీజర్ కానీ అసలు వేరే టీమ్ ఒకటి కంప్లీట్గా దానిపైన పని చేస్తుంది. అది చాలా ఫ్రెష్ స్క్రిప్ట్. చాలా కొత్తగా వెళ్తాం.”
!['OG'ని ఏం చేయాలో నాకు తెలుసు.. ఫ్యాన్స్కు పూనకాలే: థమన్ 2 'OG'ని ఏం చేయాలో నాకు తెలుసు.. ఫ్యాన్స్కు పూనకాలే: థమన్](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-25T114636.832.jpg)
ఈ మాటలు పట్టుకున్న ఫ్యాన్స్.. ఈ వీడియోను కట్ చేసి ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఓజీ సినిమా పాన్ ఇండియా మూవీ. అలానే దీనికి వక్క్ చేస్తున్న క్యాస్టింగ్ కూడా అదే రేంజ్లో ఉంది. ఇక థమన్తో పాటు ఇందులో వర్క్ చేస్తున్న వాళ్లంతా సినిమాపై చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మధ్యే సినిమా గురించి అర్జున్ దాస్ కూడా చాలా గొప్పగా చెప్పారు.
దీనికి ఆయన చాలా ఇంట్రస్టింగ్గా సమాధానమిచ్చారు. “సినిమాలో నా పాత్ర గురించి నేను ఇప్పుడు రివీల్ చేయలేను. కానీ చాలా మంచి రోల్ చేశాను. అసలు సినిమా అయితే వేరే లెవల్లో ఉంటుంది. గ్లింప్స్, టీజర్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. పవర్ స్టార్ స్వాగ్ ఆ రేంజ్లో ఉంటుంది. ఇంతకంటే చెప్పలేను” అని సింపుల్గా హింట్ ఇచ్చారు.
సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మరో వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ఊహించని విధంగా రూ. 18 కోట్లకు అమ్ముడుపోయాయట.ఈ యాక్షన్ డ్రామాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. అలానే ఇమ్రాన్ హష్మీ,శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్,హరీష్ ఉత్తమన్, అర్జున్ దాస్ ఇలా చాలా మంది ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. 2023 డిసెంబర్ లేదా 2024 ఏప్రిల్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం సినిమా హైదరాబాద్లో 4వ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.