Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ తల్లి ఇందిరాదేవి మరణం ఘట్టమనేని కుటుంబాన్ని ఎంతగానో కలచివేసింది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణకి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎందుకంటే ఒకే ఏడాది కొడుకు, భార్యను పోగొట్టుకోవడంతో కృష్ణ దుఖసాగరంలో మునిగిపోయారు. పెద్ద కొడుకు రమేష్ బాబు జనవరి నెలలో మరణించడం జరిగింది. ఈరోజు మొదటి భార్య ఇందిరాదేవి మరణంతో కృష్ణ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు భార్యల మరణాలతో.. కృష్ణ పూర్తిగా కృంగిపోయారు. 2019వ సంవత్సరంలో కృష్ణ రెండవ భార్య విజయనిర్మల మరణించడం తెలిసిందే. మహేష్ తల్లి ఇందిరాదేవి.. కృష్ణకి మొదటి భార్య. స్వయాన మేనమామ కూతురు మరదలు కావడంతో.. 1961వ సంవత్సరంలో కృష్ణ ఇండస్ట్రీ కెరియర్ ప్రారంభంలో ఇందిరాదేవిని వివాహం చేసుకున్నారు.
ఇందిరా దేవిని వివాహం చేసుకున్నాక కృష్ణ కెరియర్ లో అనేక విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు విజయనిర్మలని కృష్ణ రహస్యంగా ఓ గుడిలో రెండో వివాహం చేసుకున్నారు. భర్త కృష్ణ రెండో వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న గాని.. ఇందిరాదేవి పెద్దగా స్పందించలేదు. పిల్లలే ప్రపంచం అన్న రీతిలో ఇందిరాదేవి బ్రతకడం జరిగింది. తన ఐదుగురు పిల్లల విషయంలో ఇందిరాదేవి ఎంతో శ్రద్ధ తీసుకునే వాళ్ళు. ముఖ్యంగా మహేష్ విషయంలో చాలా శ్రద్ధ పెట్టేవాళ్ళు.
అయితే వయోభారం రీత్యా పలు అనారోగ్య సమస్యలతో గతకొంత కాలంగా పోరాడుతున్న ఇందిరాదేవి నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో సందర్శనార్థం ఉదయం పద్మాలయ స్టూడియోలో భౌతికకాయం ఉంచారు. అనంతరం పద్మాలయ స్టూడియోస్ నుంచి ఇందిరా దేవి భౌతిక కాయానికి అంతిమయాత్ర నిర్వహించారు. పంజాగుట్ట లోని మహాప్రస్థానంకి జరిగిన ఈ అంతిమయాత్రలో కొడుకు మహేష్ బాబు కుండపట్టుకుని… అంతిమయాత్ర ముందు నడిచారు. అనంతరం స్మశాన వాటికలో తల్లికి మహేష్ కొరివి పెట్టడం జరిగింది.