ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కృతిశెట్టి. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత వచ్చిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఈ అమ్మడు వైపు తెలుగు దర్శకులు దృష్టిపెట్టడం మానేశారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో కృతి శెట్టి నాగ చైతన్యకి జోడీగా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. డిఫరెంట్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. అలాగే మలయాళంలో పాన్ ఇండియా మూవీలో కృతి శెట్టి నటిస్తుంది.
ఇక తమిళంలో సూర్యకి జోడీగా ఒక సినిమాలో కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. శివ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీని సూర్య ప్రస్తుతం చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ తాజాగా జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి కృతి శెట్టిని తప్పించినట్లు టాక్ వస్తుంది. దీనికి కారణం కెరియర్ ఆరంభంలో కృతి శెట్టికి ఈ మూవీ ఆఫర్ వచ్చింది. అయితే అప్పుడు అనుకున్న రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.
అయితే కృతి శెట్టి మాత్రం ఇప్పుడు మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేసిందని టాక్. ఈ నేపధ్యంలో కృతి శెట్టిని ఈ సినిమా నుంచి పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్న నేపధ్యంలో మరో క్రేజీ హీరోయిన్ ని సూర్యకి జోడీగా తీసుకోవాలని దర్శక, నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. దీంతో బేబమ్మని దురదృష్టం వెంటాడుతోందని టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది అధికారికంగా కన్ఫర్మ్ అయితే కానీ తెలియదు.