ఆదిపురుష్ డిజాస్టర్ ఎఫెక్ట్ తో రెమ్యునరేషన్ తగ్గించుకుంది కృతి సనన్. ఈ సినిమాలో జానకి పాత్రలో కనిపించిన ఆమె.. నాలుగేళ్లలో మూడోసారి తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడం విశేషం.
ఎంతో మురిపించి, భారీ అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. తొలి మూడు రోజులూ మురిపించినా నాలుగో రోజు నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. 11 రోజులు గడిచినా ఇప్పటికీ కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. దీంతో ఈ ఎఫెక్ట్ ఈ మూవీలో జానకి పాత్ర పోషించిన కృతి సనన్ పై పడింది.
![ఆదిపురుష్ డిజాస్టర్ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న కృతి సనన్ 2 ఆదిపురుష్ డిజాస్టర్ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న కృతి సనన్](https://rtvmedia.in/wp-content/uploads/2023/06/Untitled-design-2023-06-27T181700.542.jpg)
కృతి సనన్ :
ఆమె మరోసారి తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సి వచ్చింది. గత నాలుగేళ్లలో ఆమె తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. ఆదిపురుష్ మూవీ కోసం కృతి రూ.3 కోట్లు అందుకుంది. అయితే తన తర్వాతి సినిమా కోసం దీనిని మరింత తగ్గించిందట. హౌజ్ఫుల్ 4 మూవీతో కెరీర్ లో పీక్ స్టేజ్ కు వెళ్లిన కృతి.. అక్కడి నుంచి పతనమవుతూ వస్తోంది.
హౌజ్ఫుల్ 4 మూవీ తర్వాత ఆమె ఒక్కో సినిమాకు రూ.7 నుంచి రూ.8 కోట్లు వసూలు చేసింది. అయితే ఆ తర్వాత పానిపట్, బచ్చన్ పాండేలాంటి మూవీస్ ఫ్లాపవడంతో తన రెమ్యునరేషన్ ను రూ.5 కోట్లకు తగ్గించుకుంది. బేడియా సినిమా కోసం రూ.4 కోట్లు తీసుకోగా.. ఆదిపురుష్ మూవీ కోసం ఆమెకు రూ.3 కోట్లు మాత్రమే దక్కాయి.
ఇప్పుడా సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో కృతి సనన్ మరోసారి తన రెమ్యునరేషన్ తగ్గించుకోక తప్పలేదు. టైగర్ ష్రాఫ్ నటించిన హీరోపంతి మూవీతో బాలీవుడ్ కు పరిచయమైన కృతి.. తర్వాత దిల్వాలే, బరేలీ కీ బర్ఫీ, లూకా చుప్పిలాంటి హిట్స్ అందుకుంది. రాబ్తా, అర్జున్ పటియాలాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. అయితే హౌజ్ఫుల్ 4తో హిట్ రావడంతో తన రెమ్యునరేషన్ పెంచేసింది.