KTR: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ భారత్ రాష్ట్ర సమితి పేరుతో పార్టీని ప్రకటించడం తెలిసిందే. దేశ రాజకీయాల్లో నిర్మాణాత్మక మార్పు వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతున్న దశ నుండి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని కేసీఆర్ ప్రకటించారు. అలాగే ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణలు చేస్తున్నారు.
ఇక అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ తనయుడు కేటీఆర్ మోదీ సర్కార్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అందులో భాగంగా మోదీ రాజీనామా ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. బ్రిటన్ ప్రధానమంత్రి లిజ్ ట్రస్ రాజీనామా నేపథ్యంలో.. మోదీ కూడా ఎప్పుడు రాజీనామా చేస్తారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
బ్రిటన్ ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్ పదవీ బాధ్యతలు చేపట్టిన 45 రోజులకే రాజీనామా చేశారు. అక్కడ నెలకొన్ని ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత నేపథ్యంలో ఆమె తన వైఫల్యాలను ఒప్పుకుంటూ రాజీనామా చేశారు. ఇప్పుడు ఇదే విషయాలను కేటీఆర్ ప్రస్తావిస్తూ మోదీ రాజీనామాను డిమాండ్ చేశారు. బ్రిటన్ ప్రధాని రాజీనామా సంతోషం కలిగించిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ktr:
దేశంలో మోదీ పాలనలో నిరుద్యోగం, రూపాయి పతనం, అధిక ధరలు కొత్త రికార్డుల మోత మోగిస్తున్నాయని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. విఫల ఆర్థిక విధానాలకు బాధ్యత వహిస్తూ బ్రిటన్ ప్రధాని రాజీనామా చేశారు. మరి మీరెప్పుడు అంటూ ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి కేటీఆర్ విమర్శనాస్త్రం సంధించారు. గత 30 ఏళ్ళలో అత్యధిక నిరుద్యోగం, 45 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్భణం, ప్రపంచంలోనే అత్యధిక LPG ధరలు, అత్యల్ప రూపాయి మారకం విలువలను కేటీఆర్ తన ట్వీట్ లో ప్రస్తావించారు.
Amused to read that UK PM Liz Truss resigned in less than 45 days for her failed economic policy!
In India, we have a PM who gave us;
❇️ Highest unemployment in 30 years
❇️ Highest Inflation in 45 years
❇️ Highest LPG price in the world
❇️ Lowest Rupee Vs USD#TolerantIndia— KTR (@KTRTRS) October 21, 2022