Taraka Ratna: నందమూరి తారకరత్న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి కూడా విషాదాన్ని మిగిల్చింది. నందమూరి కుటుంబంలో తారకరత్న మరోసారి దుఃఖాన్ని మిగిల్చింది అని చెప్పాలి. ఆ కుటుంబానికి వరుస మరణాలు తీవ్రం విషాదంలోకి నెట్టేస్తున్నాయి. రాజకీయ నాయకుడిగా ప్రస్థానం మొదలు పెట్టాలని భావించిన అతనికి ఆ కల నెరవేరకుండానే మృత్యువు పలకరించింది. ఇదిలా ఉంటే తారకరత్న మరణాన్ని ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరూ కూడా వివాదాస్పదంగా మార్చేందుకు సిద్ధంగా లేరు. అయితే తాజాగా లక్ష్మీ పార్వతి మాత్రం చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ తారకరత్న మరణంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తారకరత్న మృతి పట్ల ఆమె విచారం వ్యక్తం చేస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తారకరత్న జనవరి 27న నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టిన రోజే చనిపోయాడని, అయితే చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు అతన్ని హాస్పిటల్ లో పెట్టి మేనేజ్ చేస్తూ వచ్చారని సంచలన ఆరోపణలు చేసింది. డాక్టర్లు అప్పుడే తారకరత్న గుండె ఆగిపోయింది అని చెప్పారని, అయితే చనిపోయిన వ్యక్తికి చంద్రబాబు ట్రీట్మెంట్ చేయిస్తూ వచ్చాడని విమర్శలు చేశారు.
కేవలం తన కొడుకు పాదయాత్రకి కళంకం అంతకూడదు అనే స్వార్ధ బుద్ధితోనే ఇన్ని రోజులు నిజాన్ని బయటకి రాకుండా ఉంచాడని సంచలన విమర్శలు చేసింది. చంద్రబాబు నాయుడు దరిద్రం వదిలేసినపుడే నందమూరి కుటుంబానికి పట్టిన శని వదిలేస్తుంది అని అన్నారు. తన స్వార్ధం కోసం దశాబ్దాలుగా నందమూరి కుటుంబాన్ని బలిపశువులుగా చంద్రబాబు మారుస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ఆమె విమర్శలు రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి.