యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ లైగర్. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథాంశంతో ఈ మూవీ ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ ఉంది. ఇక మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైన కారణంగా తగ్గుముఖం పట్టింది. ఓ విధంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్ కెరీర్ లోనే ఎక్కువ సమయం షూటింగ్ జరుపుకున్న సినిమాగా లైగర్ నిలిచిపోయింది. ఇక వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు.
దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఇది తెరకెక్కుతూ ఉండడం, అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో పూరి జగన్నాథ్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఇప్పటికే ఇండియన్ వైడ్ గా దీనిపై ప్రత్యేక దృష్టి ఉంది. ఇప్పటికీ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ బాగా కట్టుకుంది. మాస్ బిట్స్ తో విజయ్ దేవరకొండ డాన్స్ తో కూడా సాంగ్ లో అదరగొట్టాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి టీజర్ ని రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
జులై 21న లైగర్ సినిమా టీజర్ విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇక బాక్సింగ్ నేపథ్యంలో స్టోరీ కావడంతో కచ్చితంగా విజువల్ పూరి జగన్నాథ్ స్టైల్ లో చాలా గ్రాండియర్ గా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. మొదటిసారి పాన్ ఇండియా మూవీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతుండడంతో దీనిపైన అతను కూడా ఎక్కువగా దృష్టి పెట్టాడు. బాలీవుడ్ ప్రేక్షకులకు పూరి జగన్నాథ్ పరిచయం ఉండడం, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ టీజర్ ఏ మేరకు ప్రేక్షకులు ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాలి.