బాక్ టు బాక్ పాన్ ఇండియా మూవీస్ తో దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే. హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా దుమ్ము లేపిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తో అంచనాలను అందుకోలేక పోయినా తన స్టార్ డం ని చూపించి ఓవరాల్ గా ఇన్ని ట్రోల్స్ ని, ఫేస్ చేసి కూడా భారీ వసూళ్ళనే అందుకుందని చెప్పాలి.
ఇక ఈ సినిమా తర్వాత సలార్ తో త్వరలో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా తర్వాత…మహానటి ఫేం నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ…ప్రాజెక్ట్ కే సినిమా ఏ రేంజ్ లో రూపొందుతున్న సినిమానో అందరికీ తెలిసిందే.
![అక్షరాలా 600 కోట్లు….ఇండియాలోనే బిగ్గెస్ట్ రికార్డ్! 2 అక్షరాలా 600 కోట్లు….ఇండియాలోనే బిగ్గెస్ట్ రికార్డ్!](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/52bf8fd6-3a66-4319-9351-62c476bdd1e5.jpg)
అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే ఇప్పుడు కమల్ హాసన్ లాంటి భారీ స్టార్ తో వస్తున్న ఈ సినిమా…బడ్జెట్ పరంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతుందని సమాచారం.సినిమాను మొత్తం ఇప్పటి వరకు ఎస్టిమేషన్ బడ్జెట్ అక్షరాలా 600 కోట్ల రేంజ్ లో రూపొందుతుందని సమాచారం.
ఇది వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ…550 కోట్ల రేంజ్ బడ్జెట్, ఆదిపురుష్ 500 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందగా ఇప్పుడు ఏకంగా ప్రాజెక్ట్ కే మూవీ 600 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతూ ఉండగా ఈ సినిమా….2 పార్టులుగా తెరకెక్కుతూ ఉండగా టోటల్ 2 పార్టుల బడ్జెట్ ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఓవరాల్ గా పార్ట్ 1 లెక్క 600 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు. ఇదే కనుక నిజం అయితే ఇండియాలో ఆల్ టైం ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు.