సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్ల నుంచి వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. శ్రీమంతుడు సినిమా నుంచి సినిమా తర్వాత మహేష్ కెరియర్ లో స్పైడర్ మూవీ ఒకటే ఫ్లాప్ టాక్ వచ్చింది. మిగిలిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ టాక్ తో ఏకంగా రెండు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టినవే కావడం విశేషం. అలాగే సినిమా సినిమాకి పాత్రల ఎంతన పిక నుంచి లుక్ వరకు అన్నింటిలో మహేష్ బాబు కొత్తదనం చూపించడంతో పాటు స్టోరీ సెలక్షన్ లో కూడా ప్రత్యేకత ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అతని ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఇక మహేష్ మేనియా కూడా సినిమా సక్సెస్ లలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారిపాట సినిమాతో మరో సూపర్ హిట్ ని మహేష్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్స్ విషయంలో కూడా రోజుకొక కొత్త పేరు తెరపైకి వస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో హాట్ టాపిక్ బయటకి వచ్చింది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు రాజకీయాలని టచ్ చేయడంతో పాటు ముఖ్యమంత్రిగా కూడా నటించాడు.
ఇక ఇప్పుడు మరో సారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాజకీయలని టచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఐటీ శాఖమంత్రిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ ఈ సారి మహేష్ కోసం తనకి అలవాటైన ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కథ కాకుండా రాజకీయ నేపధ్యంలో కథని తెరపై ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది. మరి మహేష్ సక్సెస్ ట్రాక్ చూస్తూ ఉంటే ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకునేలానే ఉన్నాడు.