Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కాసేపటి క్రితం ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆమె బాధపడుతూ చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె మృతితో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదఛాయలు అమ్ముకున్నాయి. 1961వ సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ ఇంద్ర దేవిని పెళ్లి చేసుకున్నారు.
ఇందిరా దేవి కృష్ణకి.. స్వయాన మరదలు కావటం విశేషం. కృష్ణకు ఇందిరాదేవి మొదటి భార్య కాగా.. వీళ్లకు ఐదుగురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు.. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతిచెందగా ఇప్పుడు.. తల్లి ఇందిరా దేవి మరణంతో మహేష్ కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇందిరా దేవి చాలా కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ కూడా చేసినట్లు సమాచారం. వయోభారం రీత్యా పలు అనారోగ్య కారణాలతో చివర ఆఖరికి ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.