సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు . హైదరాబాద్లో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఈ స్టార్ హీరో.. విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. కచ్చితంగా గుంటూరు కారం సంక్రాంతికే వస్తుందని చెప్పాడు. ఈ హీరో క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇటీవలే ఈ చిత్రబృందంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో అసలు ఈ సినిమా సరిగ్గా పట్టాలెక్కుతుందా.. షూటింగ్ పూర్తైనా.. సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అన్న అనుమానం ఫ్యాన్స్లో నెలకొంది. ఇప్పుడు మహేశ్ బాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ సందేహాలన్నీ పటాపంచలు చేసేసింది.
![‘గుంటూరు కారం’ రూమర్స్కు చెక్ పెట్టిన మహేశ్ బాబు 2 ‘గుంటూరు కారం’ రూమర్స్కు చెక్ పెట్టిన మహేశ్ బాబు](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-21T104143.929.jpg)
అయితే కొంతకాలం నుంచి గుంటూరు కారం టీమ్కు అసలు కలిసి రావడం లేదు. మొదట హీరోయిన్ పూజా హెగ్డే.. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఇక ఇటీవల ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్.. ఇలా ఒకరి వెంట మరొకరు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు. మరోవైపు మహేశ్ బాబు వెంట వెంటనే ఒకటి తర్వాత మరో సినిమా ప్రకటించేస్తున్నాడు. ఇదంతా మహేశ్ ఫ్యాన్స్ను గందరగోళానికి గురి చేసింది. ఇది చాలదన్నట్లు గుంటూరు కారం పోస్ట్ పోన్ అంటూ ట్విటర్లో హ్యాష్ట్యాగ్లు పెట్టి తెగ ట్రెండ్ చేసారు ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. ఇక మహేశ్ ఇచ్చిన క్లారిటీతో ఇప్పుడు వాళ్లంతా ఫుల్ ఖుష్ అవుతున్నారంట .