పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వరించింది. దీని గురించి ఇటు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు . అయితే మహేశ్ బాబు చేసిన ఒక పాత ట్వీట్ ఒకటి ఇప్పుడు తెగ వైరల్గా మారింది.
అదృష్టం లేకపోతే బెల్లం ముట్టుకున్నా అల్లం అవుతుందని ఒక పాత సామెత ఉంది. సడెన్గా ఇప్పుడు ఇదెందుకు గుర్తొచ్చిందంటే ప్రస్తుతం మహేశ్ బాబు ఫ్యాన్స్ కొంతమందికి ఆనందపడాలో లేక బాధపడాలో తెలీడం లేదు. పుష్ప సినిమాకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు ఇచ్చారు . దీంతో టాలీవుడ్ మొత్తం పండగ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ ఘనత సాధించిన తొలి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ రికార్డు కొట్టేశాడు. దీంతో నిన్నటి నుంచి అల్లు అర్జున్, పుష్ప ది రూల్ హ్యాష్ ట్యాగ్లు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం మహేశ్ ఓల్డ్ ట్వీట్ను ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు. ఆ సంగతేంటో చూద్దాం.
![నేషనల్ అవార్డ్ మిస్ అయిన మహేశ్ బాబు'.. పాత ట్వీట్ వైరల్ 2 నేషనల్ అవార్డ్ మిస్ అయిన మహేశ్ బాబు'.. పాత ట్వీట్ వైరల్](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-25T121816.268.jpg)
నిజానికి సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప: ది రైజ్ సినిమా కి మొదటగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు.అయితే క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా మహేశ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారంట . ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ బాగా నచ్చి అల్లు అర్జున్ సినిమా చేసి పాన్ ఇండియా హిట్ ని కొట్టేశాడు. అంతేకాకుండా నేషనల్ అవార్డు కూడా వెతుక్కుంటూ వచ్చింది. దీంతో మహేశ్ చేసిన ఓ పాత ట్వీట్ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
“క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సుకుమార్తో నా మూవీ ముందుకు వెళ్లడం లేదు. ఆయన కొత్త ప్రాజెక్ట్కు నా శుభాకాంక్షలు. ఒక సినిమా మేకర్ పట్ల నా గౌరవం ఎప్పటికీ అలానే ఉంటుంది. 1 నేనొక్కడినే ఎప్పటికీ కల్ట్ క్లాసిక్గా మిగిలిపోతుంది. ఆ సినిమాకి పని చేస్తున్నప్పుడు ప్రతి క్షణాన్ని బాగా ఎంజాయ్ చేశాను” అని మహేశ్ బాబు అప్పట్లో ట్వీట్ చేసారంట .