మహేష్ బాబు సినీ కెరీర్ లో కాస్త ఇబ్బంది పెట్టిన సీన్ …..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినీ కెరీర్ లో ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈయన నాని మూవీలో నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు తన సినీ కెరీర్ లో ఏ సినిమా కోసం కూడా రెండు గంటల పాటు ఆ పని చేయలేదట మహేష్ బాబు. ఒకే ఒక్క మూవీ కోసం మహేష్ బాబు రెండు గంటల పాటు ఆ పని చేశారంట . ఇంతకు మహేష్ బాబు చేసిన ఆ పని ఏమిటి ? ఎందుకు అంతలా ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
![మహేష్ బాబు సినీ కెరీర్ లో కాస్త ఇబ్బంది పెట్టిన సీన్ ..? 2 మహేష్ బాబు సినీ కెరీర్ లో కాస్త ఇబ్బంది పెట్టిన సీన్ ..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-28T124323.728.jpg)
మహేష్ బాబు హీరోగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా చేసిన భరత్ అనే సినిమా లో మహేష్ బాబు తన తండ్రి మరణిస్తే.. తండ్రి నిర్వహించిన ముఖ్యమంత్రి బాధ్యతలను చేపడుతారంట . ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేసన్స్ కూడా పెడతారు. అదేవిధంగా ఈ చిత్రంలో ఉండే ప్రతీ ఒక్కటి చాలా మందిని ఆకట్టుకుంది. అచ్చం మూవీ మాదిరిగానే బయట కూడా ఉంటే బాగుండు కదా అని అనుకున్నారంట చాలా మంది. ఈ మూవీ మొత్తానికి హైలెట్ అయిన సన్నివేశం ఒకే ఒక్కటి.
అదే మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇచ్చిన స్పీచ్.. “ భరత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్దతో నిర్వహిస్తానని” అంటూ మహేష్ బాబు ఇచ్చే స్పీచ్ చాలా మంది ప్రజలను ఆకట్టుకుంది. ఈ స్పీచ్ నేర్చుకోవడం కోసం మహేష్ బాబుకి ఏకంగా రెండు గంటల సమయం పట్టిందట. తన సినీ కెరీర్ లో తొలిసారి ఒక డైలాగ్ కోసం రెండు గంటల సమయం తీసుకున్నది ఈ మూవీ కోసమేనట. ఈ సినిమా లోని డైలాగ్ కోసం తనలో ఉండే రాజకీయ నాయకుడి గంభీరత్వం రావడం కోసం రెండు గంటల పాటు ట్రై చేశాక మొత్తం డైలాగ్ వచ్చిందట. ఇక భరత్ అనే నేను మూవీ సమయంలో ఈ డైలాగ్ కోసం మాత్రమే ఎక్కువ సమయం ఎక్కువ టేక్స్ తీసుకున్నారంట మహేష్ బాబు.