Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి మరణ వార్త ఇండస్ట్రీలో విషాదాన్ని నిలిపింది. రెండు వారాల క్రితం సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడం ఆ తర్వాత ఇప్పుడు మహేష్ తల్లి ఇందిరాదేవి మరణం ఇండస్ట్రీని కరవరంలోకి నెట్టేసింది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుకి తల్లి అంటే సెంటిమెంట్ అని అందరికీ తెలుసు. తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు నాడు ఇంకా మదర్స్ డే, ఉమెన్స్ డే నాడు తన పోస్టులతో అమ్మ పై ప్రేమను చాటుతూ ఉంటాడు. మహేష్ నటించిన “మహర్షి” సక్సెస్ మీట్ లో కూడా తన తల్లి గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది.
ప్రతి సినిమా విడుదల అవ్వకముందు తన తల్లి దగ్గరికి వెళ్లి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని, ఆమె చేసి ఇచ్చిన కాఫీ తాగుతాను. అది దేవుడు ప్రసాదం మాదిరిగా ఉంటుంది. నా తల్లి నాకు దేవతతో సమానమని మహేష్ చెప్పడం జరిగింది. జీవితంలో నేను ఇంత విజయం సాధించడానికి కారణం మా అమ్మే. “మహర్షి” సినిమా విజయం తల్లులందరికి అంకితం చేస్తున్నట్లు మహేష్ అప్పుడు స్పీచ్ ఇచ్చారు. అప్పటి స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. తాను ఎంతగానో ప్రేమించే తల్లి మరణంతో మహేష్ కన్నీరు మున్నీరవుతున్నారు.
తన తల్లి దగ్గర మాత్రమే కాదు.. బాల్యంలో ఎక్కువ మహేష్ తన అమ్మమ్మ దగ్గర కూడా పెరగటం జరిగింది. ఆమె అంటే కూడా మహేష్ కి విపరీతమైన ప్రేమ. తన లైఫ్ లో ఎక్కువగా ఆమె చేతివంటలే ఇష్టపడటం జరిగిందని కొన్ని ఇంటర్వ్యూలలో మహేష్ తెలియజేశారు. పరిస్థితి ఇలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో అన్నయ్య రమేష్ బాబు ఇప్పుడు తల్లి ఇందిరాదేవి మరణించడంతో మహేష్ ఎంతో వేదన చెందుతున్నారు.