Mahesh Babu: హీరోయిన్ రష్మిక మందన పై మహేష్ అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. విషయంలోకి వెళ్తే నిన్న ఉదయం మహేష్ తల్లి ఇందిరాదేవి మరణించడం తెలిసిందే. వయోభారం రీత్యా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరా దేవి గత కొంతకాలంగా వీల్ చైర్ కే పరిమితమయ్యారు. ఈ క్రమంలో నిన్న ఉదయం తుది శ్వాస విడిచారు. మహేష్ తల్లి మరణించడంతో సినీ రాజకీయ ప్రముఖులు భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. మరి కొంతమంది నిన్నే సోషల్ మీడియా ద్వారా సానుభూతి తెలియజేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే మహేష్ తల్లి చనిపోయి… అంత్యక్రియలు కూడా జరిగిపోయాక.. సరిగ్గా 24 గంటలు తర్వాత రష్మిక మందన స్పందించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే “రెస్ట్ ఇన్ పీస్ అమ్మ” అని రష్మిక మందన తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసింది. దీంతో రష్మికపై మహేష్ అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. “ఇప్పుడు లేచావా..? నిన్నంతా ఏం చేసావ్..?”. ఇప్పుడు గుర్తొచ్చిందా మేడం..? అని చివాట్లు పెడుతున్నారు.
2020లో మహేష్ బాబుతో రష్మిక మందన “సరిలేరు నీకెవ్వరు” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఫస్ట్ టైం రష్మిక మందన ఒక పెద్ద స్టార్ హీరో అయినా మహేష్ సరసన ఈ సినిమాతోనే అవకాశం అందుకుంది. అంతటి అవకాశం ఇచ్చిన హీరో తల్లి చనిపోయి అంత్యక్రియలు కూడా పూర్తయి చాలా గంటలు గడిచిన తర్వాత రష్మిక మందన స్పందించటం.. పట్ల అభిమానులు ఎంతగానో సీరియస్ అవుతున్నారు