యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టాడు ఆదిపురుష్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా, సలార్ సినిమా షూటింగ్ జరుగుతుంది. అలాగే ప్రాజెక్ట్ కె కూడా షూటింగ్ కి రెడీ అవుతుంది దీన్ని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. అలాగే డైరెక్టర్ మారుతితో కూడా ఒక సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కనుంది. డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. ఇప్పటికే దర్శకుడు మారుతి ఈ సినిమా కథని లాక్ చేసినట్లు తెలుస్తుంది. మారుతీ స్టైల్ లోనే కామెడీ ఎంటర్టైనర్ గానే యాక్షన్ మిక్స్ తో ఈ సినిమా ఉంటుందనే టాక్ ఉంది.
ఇది ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా ముగ్గురు భామలని దర్శకుడు మారుతి ప్లాన్ చేసాడు. వారిలో మలయాళీ బ్యూటీ మాళవికా మోహనన్ కూడా ఉంది. ఇప్పటికే తమిళంలో స్టార్ హీరో విజయ్ కి జోడీగా నటించి మెప్పించిన ఈ అమ్మడు టాలీవుడ్ లోకి కూడా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుంది. ఇలాంటి సమయంలో ప్రభాస్ లాంటి హీరోతో నటించే అవకాశం వస్తే ఎవరు కాదనుకుంటారు. దీంతో ఈ అమ్మడు కూడా వెంటనే ఒకే చెప్పేసింది. ప్రభాస్ తో హీరోయిన్ గా అంటే పాన్ ఇండియా రేంజ్ లో ఎస్టాబ్లిష్ కావచ్చని ఈ బ్యూటీ భావిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో రచ్చలేపే ఈ అమ్మడు ప్రభాస్ సినిమా కోసం ఓ విధంగా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
అయితే ఈ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉందనే మాట ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. మారుతి చాలా తక్కువ సమయంలో ఈ సినిమా పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకొని 45 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ప్రభాస్ దగ్గర తీసుకున్నారు. ఈ కారణంగా రెబల్ స్టార్ కూడా కొత్తగా ఉంటుందని మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డివివి దానయ్య కూడా ప్రభాస్ ఎప్పుడు అంటే అప్పుడు రెడీ అన్నట్లు ఉన్నారు. ఈ అమ్మడు మాత్రం వేగంగా స్టార్ట్ అయితే టాలీవుడ్ ఎంట్రీకి గ్రాండ్ ఎంట్రీ దొరుకుతుందనే ఆశతో ఎదురుచూస్తుంది.