Maniratnam: డైరెక్టర్ మణిరత్నం అంటే గొప్ప చిత్రాల దర్శకుడిగా పెట్టింది పేరు. తమిళంతోపాటు తెలుగు, హిందీలోనూ బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన ఘనత మణిరత్నంది. టేకింగ్, విజువలైజేషన్ లో మణిరత్నం హ్యాండ్ పడిందంటే సూపర్ హిట్టే. కథల ఎంపిక సైతం అదే రేంజ్ లో ఉంటుంది.
ప్రస్తుతం వస్తున్న, గతంలో వచ్చిన చాలా మంది ఫిల్మ్ మేకర్లు మణిరత్నం శిష్యులే. తన సినిమాలతో ప్రేక్షకులను పరవశింపజేయడమే కాకుండా సందేశాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ మణిరత్నం. తమిళనాట, తెలుగులోనూ మణిరత్నం దర్శకత్వంలో ఒక్క చాన్స్ వచ్చినా చాలనుకొనే తారలు కోకొల్లలు. ఇలాంటి జాబితాలో ఓ హీరో మణిరత్నం ఛాన్స్ నే కాలదన్నుకున్నాడట. ఆ కథనాయాకుడెవరనుకుంటున్నారా?
ఇటీవల పొన్నియన్ సెల్వన్-1 సినిమా రిలీజైన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో హీరో చియాన్ విక్రమ్ కరికాలన్ గా నటించి మెప్పించారు. గతంలో మణిరత్నం బొంబాయి సినిమాను విక్రమ్ తో చేద్దాం అనుకున్నారట. విక్రమ్ కు కథ కూడా నరేట్ చేశాడు మణిరత్నం. అంతా ఓకే అనుకున్నారు. అయితే, అప్పటికి విక్రమ్ మరో సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రానికి సంబంధించి గడ్డం పెంచుకున్నాడు. దాన్ని తీసేయాలని మణిరత్నం కోరగా అందుకు తిరస్కరించాడు విక్రమ్.
Maniratnam:
తర్వాత చిత్రాన్ని వదులుకున్నాడట. అదే సినిమాను అరవింద స్వామితో తీసి బంపర్ హిట్ కొట్టాడు మణిరత్నం. యధార్థ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా 1995లో విడుదలై అన్నివర్గాల మన్ననలు పొందింది. అరవింద స్వామి సరసన మనీషా కొయిరాలా అద్భుతంగా నటించారు. అలా ఆ సినిమాలో చియాన్ విక్రమ్ చాన్స్ మిస్ చేసుకున్నాడు.