మెగాస్టార్ ఇమేజ్ తోనే అల్లు అర్జున్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బన్నీ వెనుక అల్లు అరవింద్ తండ్రి స్థానంలో ఉన్నారు. అలాగే అల్లు రామలింగయ్య మనవడు అనే బ్రాండ్ కూడా ఉంది. దానికంటే బన్నీ ఎక్కువగా జనంలోకి వెళ్ళడానికి కారణం మెగా బ్రాండ్. ఆ బ్రాండ్ కారణంగానే మెగా ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ ని ఆదరించారు. దాంతో అతను కూడా సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ స్టార్ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక మెగాస్టార్ వారసుడుగా రామ్ చరణ్ కూడా హీరోగా తెరంగేట్రం చేసి ఒక్కో మెట్టు ఎక్కుతూ రంగస్థలంతో నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకున్నాడు. అయితే గత కొంత కాలం ఉంచి మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ మాట్లాడటానికి ఇష్టపడక పోవడంతో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని ద్వేషించడం మొదలు పెట్టారు. అది కాస్తా మెల్లగా పెరుగుతూ అల్లు ఫ్యాన్స్ వెర్సస్ మెగా ఫ్యాన్ తరహాలో వార్ పెరిగింది. ఈ కోల్డ్ వార్ కాస్తా శృతి మించి ఇప్పుడు ట్విట్టర్ లో ఒకరి మీద ఒకరు మీమ్స్ తో టార్గెట్ చేసుకునేంత వరకు వెళ్ళింది. ఎవరు క్రియేట్ చేసారో, ఎందుకు క్రియేట్ చేసారో తెలియదు. కానీ గంట లేని వారసుడు అని ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. దానికి అపోజిట్ గా తమ్ముడి గంటపై ఏఏఎం అంటూ మరో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు.
ఈ రెండు హ్యాష్ ట్యాగ్ ల మీనింగ్ చూసుకుంటే చాలా ఘోరంగా ఉంది. ఒక హ్యాష్ ట్యాగ్ లో రామ్ చరణ్ ని టార్గెట్ చేస్తూ పోస్టులు, మీమ్స్ వైరల్ చేస్తూ ఉంటే, మరో హ్యాష్ ట్యాగ్ లో అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ ఫ్యాన్స్ వార్ ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుంది. అయితే ఒకే కుటుంబంలో వారసులు ఇద్దరు బాగానే ఉన్న ఇలా ఫ్యాన్స్ సోషల్ మీడియాకి ఎక్కి రచ్చచేయడం ద్వారా మిగిలిన హీరో ఫ్యాన్స్ దగ్గర చులకన అవుతామని విషయాన్ని గ్రహించడం లేదని కొందరు డైహర్డ్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. అయితే కావాలనే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి ఎవరో కావాలనే ట్యాగ్స్ క్రియేట్ చేసి ఫ్యాన్స్ వార్ కి తెరతీశారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సదరు హీరోలు ఎలా రెస్పాన్స్ అవుతారు అనేది వేచి చూడాలి.