పాతబస్తీలో జూలై 16న నిర్వహించనున్న బోనాల పండుగ ఏర్పాట్లపై చర్చించేందుకు పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సాలార్జంగ్ మ్యూజియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, పోలీసులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.
కొత్త రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ప్రభుత్వం బోనాలు ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఉత్సవాల నిర్వహణకు వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.
అక్కన్న మాదన్న, సబ్జీమండి ఆలయాల్లో అమ్మవార్ల ఊరేగింపు కోసం ప్రభుత్వం అంబారీ (ఏనుగు) ఏర్పాట్లు చేస్తోందని.. దూరప్రాంతాల ప్రజలు టీవీల్లో చూసేలా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.