స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్ గా , జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరో వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి. మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
![ఆగష్టు 4న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ... 2 ఆగష్టు 4న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ...](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-01T143832.521.jpg)
తాజాగా ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్కు మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇదే క్రమంలో విడుదలైన పాటలు కూడా ఈ సినిమా పై ఆసక్తిని పెంచాయి అని చెప్పవచ్చు . రాధన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. సీనియర్ నటి జయసుధ ఈ సినిమాలో అనుష్కకు మదర్ పాత్రలో కనిపించనుంది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడమొత్తం 4 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది . ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది . వచ్చే నెల అంటే ఆగష్టు 4 న ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తునట్టు తెలుస్తుంది. అయితే దీని పై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చాల రోజుల తర్వాత అనుష్క స్క్రీన్ పై ఈ మూవీ తో కనిపించనుంది. మరి ఈ మూవీ ప్రేక్షకులని ఈ మేరకి మెప్పిస్తుందో చుడాలి