టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ .. స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించిన లేటెస్ట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న థియేటరల్లో రిలీజ్ కానున్నది . ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ను కూడా రిలీజ్ చేసారు . ఈ సందర్భంలో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసారు
ఈ ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగానే తన పేరు ముందు ది అని పెట్టడం గురించి కూడా . అలాగే సోషల్ మీడియాలో అనసూయతో గొడవ గురించి కూడా తానూ స్పందించారు. ఇంతకీ విజయ్ ఏం చెప్పారంటే..?
![నా పేరు ముందు ‘ది’ అందుకే ఇప్పుడు చెప్పండి.. విజయ్ దేవరకొండ 2 నా పేరు ముందు ‘ది’ అందుకే ఇప్పుడు చెప్పండి.. విజయ్ దేవరకొండ](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-10T111106.370.jpg)
‘లైగర్ సమయంలో పూరీ జగన్నాథ్ అన్నారు అలాగే నాకు రెండు మూడు టైటిల్స్ ని కూడా చెప్పారు. ఆ టైటిల్స్తో నాకు అవసరం లేదని చెప్పాను. నా పేరు నాకు సరిపోతుందని చెప్పాను. కావాలంటే ‘ది విజయ్ దేవరకొండ’ వాడుకోవమని సలహా ఇచ్చాను. ఇకపోతే సోషల్ మీడియలో అనసూయతో గొడవలు ఏం జరుగుతున్నాయో నాకైతే తెలీదు. గొడవపడే వాళ్లనే అడగండి’ అని విజయ్ చెప్పుకొచ్చారు.