Nadendla Bhaskara Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలక రాజకీయ పరిణామాలకు కేంద్ర బిందువుగా ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు.. తన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలుపెట్టారో వివరించారు. ఆంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్ కు వచ్చిన తాను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నట్లు నాదెండ్ల భాస్కర్ రావు వెల్లడించారు. చదువులో బాగా రాణించే తాను బారిష్టర్ పూర్తి చేసినట్లు వివరించారు.
తన చదువు పూర్తయ్యాక హైదరాబాద్ లో ఉన్న హైకోర్టులో ప్లీడర్ గా తన కెరీర్ ను ప్రారంభించినట్లు నాదెండ్ల భాస్కర్ రావు వెల్లడించారు. కోర్టు విషయాల్లో పరిజ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల తాను కెరీర్ పరంగా బాగా సాగిందని, తన కింద ఐదారుగురు జూనియర్ ప్లీడర్లు తన కింద ఉండే వారని, వారికి కేసుల విషయంలో సహాయం చేసే వాడినని నాదెండ్ల చెప్పుకొచ్చారు.
తాను హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఉండే వాడినని, తన ఇంటికి దగ్గరలో గవర్నర్ గా చేసిన పట్టాభి సీతారామయ్య ఉండే వారని నాదెండ్ల భాస్కర్ రావు తెలిపారు. ఆయనతో అప్పుడప్పుడు మాట్లాడటం వల్ల చాలా విషయాలు తమ మధ్య చర్చకు వచ్చేవని, రాజకీయ విషయాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చేవని అన్నారు.
చిన్నప్పటి నుండి లీడర్ షిప్ మీద ఆసక్తి ఉన్న తనకు పట్టాభి సీతారామయ్యతో మాటలు మరింత రాజకీయ పరిజ్ఞానం ఇచ్చాయని నాదెండ్ల భాస్కర్ రావ్ వెల్లడించారు. ఒకసారి తనకు తెలిసిన రామచంద్రా రెడ్డి.. మర్రి చెన్నారెడ్డిని కలిసి వద్దామని చెబితే, ఇద్దరం కలిసి వెళ్లామని అన్నారు. అప్పుడే ప్రాంతీయ పార్టీల గురించి మర్రి చెన్నారెడ్డి మాట్లాడారని, ప్రాంతీయ పార్టీల గురించి చెన్నారెడ్డి మాట్లాడితే, ఆ సమయంలో ఇందిరాగాంధీ మీద ప్రజలకు తీవ్ర సానుభూతి ఉన్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల ఆలోచన సరైంది కాదని తాను చెప్పినట్లు నాదెండ్ల తెలిపారు.
Nadendla Bhaskara Rao:
మర్రి చెన్నారెడ్డి మరికొందరు చివరకు ప్రాంతీయ పార్టీ గురించి సీరియస్ గా మాట్లాడుకోవడంతో రాష్ట్రంలోని నలుమూలల నుండి నాయకులను తరలించాలని అనుకున్నారని నాదెండ్ల తెలిపారు. అప్పుడు తాను కూడా విజయవాడ నుండి కొంతమందిని పిలిపించానని చెప్పుకొచ్చారు. అప్పటి నుండి తన రాజకీయ ప్రాస్థానం మొదలు కాగా, తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఎన్టీఆర్ చేరడం, ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల పార్టీ నాది కాదు అనే ప్రచారం సాగిందని నాదెండ్ల భాస్కర్ రావు వివరించారు.