టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. యువ గళం పేరుతో చేపట్టబోయే ఈ పాదయాత్రకు డీజీపీ నుంచి ఇంకా అనుమతి రాలేదు. అయితే పాదయాత్రకి అనుమతి రాకపోయినా కూడా కచ్చితంగా జరుగుతుందని టీడీపీ నాయకులు గట్టిగా చెబుతున్నారు. పోలీసులు పర్మిషన్ ఇచ్చిన ప్రజల కోసం నారా లోకేష్ రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేస్తారని అంటున్నారు. నారా లోకేష్ పాదయాత్రకి బయపడి వైసీపీప్రభుత్వం కావాలని ఆటంకాలు సృష్టిస్తుందని విమర్శలు చేస్తున్నారు.
అయితే ఈనెల 27 నుంచి కుప్పం నుంచి పాదయాత్రను నారా లోకేష్ ప్రారంభించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ పాదయాత్ర పై తాజాగా చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పందించారు. పాదయాత్రకు టీడీపీ చేసుకున్న దరఖాస్తులు నిబంధనలకు లోబడి పరిశీలిస్తామని తెలిపారు. కచ్చితంగా నిబంధనల మేరకు పాదయాత్ర చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఈ పాదయాత్ర అనుమతి పై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
పాదయాత్రలో ఎలాంటి హింసాత్మక వ్యాఖ్యానాలు చేయకుండా నిర్వహించుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదని తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే వైసీపీనాయకులు నారా లోకేష్ పాదయాత్ర పై విమర్శలు చేస్తున్నారు. నారా లోకేష్ ఏమి చేసిన వైసీపీని ఓడించడం కాదు కదా ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేరని ఛాలెంజ్ చేసుకున్నారు. వైసీపీచేస్తున్న పాదయాత్ర టీడీపీకి మంగళం పాడే యాత్రను మంత్రి రోజా విమర్శించింది.
నారా లోకేష్ పాదయాత్రకు అడ్డు చెప్పాల్సిన అవసరం వైసిపికి లేదని పలువురు వైసీపీఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ పై అనవసరమైన విమర్శలు చేస్తే మాత్రం సహించేది ఉండదని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్ర పై ఏపీలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. వైసీపీ టీడీపీ మధ్య నారా లోకేష్ పాదయాత్ర పెద్ద చర్చిని అంశంగా మారిపోయింది.