TDP: ఏపీలో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడానికి టీడీపీ చాలా వ్యూహాలు చేస్తుంది. అలాగే టీడీపీకి భవిష్యత్తు నాయకుడిగా నారా లోకేష్ ని ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీనికోసం లోకేష్ తో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేయిస్తుంది. అయితే ఇప్పుడు ఈ పాదయాత్ర ఆ పార్టీని ప్రజలకి దూరం చేస్తుందా అంటే అవుననే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఏపీ రాజకీయాలలో పాదయాత్రకి మంచి ఇమేజ్ ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు పాదయాత్రతో అధికారంలోకి వచ్చారు. మరల జగన్ కూడా పాదయాత్రని నమ్ముకుంటే ప్రజలు పట్టం కట్టారు.
ఈ నేపధ్యంలో నారా లోకేష్ కూడా దీనినే తనని తాను లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎంచుకున్నాడు. అయితే పాదయాత్ర చేయడం సమస్య కాదు. కాని దాంతో ప్రజలని ఆకర్షించాలి అంటే నాయకత్వ లక్షణాలు ముందునుంచే ఉండాలి. నారా లోకేష్ కి నాయకత్వ లక్షణాలు లేవని మొదటి నుంచి అందరూ చేసే విమర్శ. అయినా కాని పాదయాత్ర చేయడానికి అతను నిర్ణయించుకున్నాడు. టీడీపీని అధికారంలోకి తీసుకురవాడానికి సిద్ధమైపోయాడు. ఇక వచ్చే ఎన్నికలలో తాము అధికారంలోకి వచ్చేస్తామని తన మీటింగ్ లలో కూడా స్పష్టం చేసేస్తున్నాడు. అయితే ఇలా చెప్పే క్రమంలో అతని మాటలు కాస్తా శృతి మించుతున్నాయి అనే మాట వినిపిస్తుంది.
తన పాదయాత్రని చూసి వైఎస్ జగన్ భయంతో వణికిపోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తనను అడ్డుకోవడానికి వ్యూహాలు వేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులలో గుడ్డలూడదీసి నడిపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక పోలీసులని కూడా వదలం అని వార్నింగ్ ఇస్తున్నారు. అతని మాటల్లో ఎక్కువగా ప్రతీకార దర్పం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి మాటల ద్వారా ప్రజలలో మరింత చులకన అయిపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. వైఎస్ జగన్ కూడా పాదయాత్రని సీరియస్ గా తీసుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది. ఆ పార్టీని నారా లోకేష్ దగ్గరుండి ఓడిస్తాడని, ఇక మనకి ఎలాంటి కష్టం ఉండదని భావిస్తున్నట్లు టాక్.