కార్తికేయ 2 మూవీతో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తెలుగులో కంటే హిందీలో మంచి హిట్ అయ్యింది. దీంతో తన నెక్స్ట్ సినిమాల విషయంలో ఇప్పుడు నిఖిల్ మరిన్ని జాగ్రత్తలు తీసుకొని కంటెంట్ ని పాన్ ఇండియా లెవల్ లోనే తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ నిర్మాణంలో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ అనే సినిమా చేశాడు. అయితే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కార్తికేయ 2 హిట్ తో మళ్ళీ కొన్ని మార్పులు చేసి రీషూట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే కొత్త దర్శకుడితో స్పై థ్రిల్లర్ మూవీని కూడా నిఖిల్ చేస్తున్నాడు.
ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్ లోనే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కథలో కూడా మళ్ళీ నిఖిల్ మార్పులు సూచించినట్లు తెలుస్తుంది. ఐశ్వర్య మీనన్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతుంది. ఇదిలా ఉంటే తన నెక్స్ట్ సినిమాల విషయంలో కచ్చితంగా 50 కోట్లకి పైగా బడ్జెట్ ఉండాల్సిందే అని దర్శక, నిర్మాతలకి నిఖిల్ చెబుతున్నాడనే మాట వినిపిస్తుంది. పాన్ ఇండియా అప్పీల్ రావాలంటే ఆ స్థాయిలో బడ్జెట్ తన మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్న దర్శకులతోనే సినిమాలు చేయాలని కూడా నిఖిల్ భావిస్తున్నట్లు టాక్.
ఒకవేళ ఎవరైన కొత్త కథలతో వచ్చిన ముందుగానే బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు అని అడుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. ఇదిలా ఉంటే ఇక చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 3 కోసం నిఖిల్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అని టాక్. వీలైతే వచ్చే ఏడాదిలోనే సినిమాని ప్రారంభిద్దాం అని చందూకి నిఖిల్ చెప్పినట్లు వినిపిస్తుంది. చందూ మొండేటి కూడా కార్తికేయ 3 మూవీని వీలైనంత వేగంగా ప్రేక్షకులకి అందించేందుకు రెడీగా ఉన్నట్లు గతంలోనే చెప్పాడు.