KTR: మంత్రి కేటీఆర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్కసారి కూడా ఎన్నికల్లో డబ్బులు పంపచలేదని, మందు పోయించలేదని ఆశ్చర్యక ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు మంత్రి కేటీఆర్ ట్యాబ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
ఎన్నికల్లో తానెప్పుడూ ఇప్పటివరకు డబ్బులు పంచలేదని, ఓటర్లకు మందు పోయించడలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచడం లాంటి దరిత్రపు పనులు తానెప్పుడు అసలు చేయలేదన్నారు. భవిష్యత్ లో కూడా డబ్బులు పంచడం, మందు పోయించడం, మహిళలు చీరలు పంచి పెట్టడం, ఓటర్లకు బహుమతులు ఇవ్వడం లాంటి పనులు తానెప్పుడు చేయలేదని, రానున్న కాలంలో కూడా అసలు చేయనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఓటర్లకు డబ్బులు పంచడం, మందు పోయించడం, బిర్యానీలు పెట్టడం లాంటి సంస్కృతి మంచిది కాదని కేటీఆర్ సూచించారు.
చాలామంది ఎన్నికల్లో గెలుపొదటం కోసం డబ్బులు పంచి పెడతారని, మందు తాగేవారికి మందు పోయిస్తారని, ఎవరికి కావాల్సినవి వారికి ఇస్తారని తానకు తెలుసని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టినా బూడిదలో పోసిన పన్నీరేనని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గమైన సిరిసిల్లలో డబ్బులు పంచి పెట్టవద్దని, మందు పంపిణీ చేస్తూ ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసే సంస్కతి అసలు తీసకురావద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. అలాంటి దరిద్రపు పనులు ఎవరూ చేయవద్దని హితవు పలికారు.
KTR:
ఓళ్లు వంచి కష్టపడి పని చేస్తే ఎననికల్లో గెలుస్తారని, డబ్బులు పంచితే గెలవరి కేటీఆర్ సూచించరు. సిరిసిల్లలో తనతో పోటీ పడేవారు తన కంటే రెండు ఎక్కువ పనులు చేయాలని, అప్పుడు ప్రజల్లో మంచి పేరు వస్తుందని కేటీఆర్ తెలిపారు. అప్పుడు ప్రజలు మిమ్మల్ని గుర్తు పట్టుకుంటారిని కేటీఆర్ స్పష్టం చేశారు.