Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజే వేరు. సీనియర్ ఎన్టీఆర్కు మనవడిగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ యంగ్ టైగర్కు స్పెషల్ అసెట్. ఇటీవల నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జపాన్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి జపాన్కు వెళ్లిన తారక్కు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఇక ఆ తరువాత అక్కడ మూవీ ప్రమోషన్స్లో బిజీబిజీగా కాలం గడిపేస్తున్నాడు.
జపాన్లోని ఓ హోటల్లో బస చేసేందుకు ఎన్టీఆర్ వెళ్లాడు. అక్కడ తారక్ను చూసిన జపానీయులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఎన్టీఆర్తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇప్పటి వరకూ మనోడి క్రేజ్ దక్షిణాదికే పరిమితం అనుకున్న వారు ఈ ఘటనను చూసి అవాక్కయ్యారు. విదేశాల్లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్, క్రేజ్ను చూసి అవాక్కవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఎన్టీఆర్ను ఆటోగ్రాఫ్ అడిగారు. వారితో ఆయన కూడా సరదాగా కాసేపు ముచ్చటించారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ను చూసిన ఓ మహిళ అభిమాని భావోద్వేగానికి గురైంది. తారక్ను చూసిన ఆనందంలో చిన్న పిల్లలా బోరున ఏడ్చేసింది. ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. జపాన్లో ఎన్టీఆర్ను చూసి మహిళ కన్నీళ్లు పెట్టుకోవడమేంటని నెటిజన్లు మరింత అవాక్కవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను త్వరలో జపాన్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే మూవీ టీం అక్కడ ప్రమోషన్స్ రాబట్టింది. దీని కోసమే తారక్, చెర్రీ తమ కుటుంబంతో సహా జపాన్కు వెళ్లారు. అక్కడ ప్రమోషన్స్ చూసుకుంటూనే మరోవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు.