యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ ప్రపంచంలో ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను కూడా అదే స్థాయిలో ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతున్నారు. ఈ కారణంగానే సినిమా ప్రారంభం కావడానికి మరి కొంత సమయం పట్టేలా ఉంది. యూనివర్సల్ ఎలిమెంట్ ని మరింత గ్రాండ్ గా ఆవిష్కరించడం కోసం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండబోతుందని అందరికీ తెలిసిందే.
ఇప్పటికే కేజిఎఫ్ సిరీస్ తో ఇండియన్ వైడ్ గా ఫ్యాన్స్ సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సరదాగా సాగుతుంది. ఆగస్టు 15 సందర్భంగా సలార్ మూవీ రిలీజ్ డేట్ ని దర్శకుడు అనౌన్స్ చేశాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్లో తెరకెక్కపోయే సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే సందేహానికి దర్శకుడు ప్రశాంత్ ఫుల్ స్టాప్ పెట్టాడు. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చాడు.
అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురంలోని ఓ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే తేదీ పై క్లారిటీ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మార్చేశారు. తారక్ ని ప్రశాంత్ నీల్ ఏ విధంగా స్క్రీన్ పై చూపించబోతున్నాడు అనేది తెలుసుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండబోతుంది అని సమాచారం.