యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. మొబైల్స్ లో ఈ టీజర్ ని మెజారిటీ ప్రజలు వీక్షించారు. అయితే ఈ టీజర్ ని చూసిన తర్వాత ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ పై ప్రతి ఒక్కరు పెదవి విరిచారు. చాలా వరస్ట్ గా సీజీ వర్క్ ఉందని, ఇంతకంటే యానిమేషన్ కార్టూన్ సినిమాలు బెటర్ గా ఉంటాయని విమర్శలు చేశారు. కొంత మంది అయితే ఏకంగా ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. రామాయణం సినిమా తీయడం బాలీవుడ్ దర్శకులకి చేతకాదు అంటూ విమర్శలు చేశారు. అసలు ప్రభాస్ రాముడి పాత్రలో అస్సలు సూట్ కాలేదని చెప్పడం స్టార్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఆదిపురుష్ లో ప్రభాస్ ని పక్క పక్కన పెట్టి పోల్చి చూసారు.
కొంత మంది ఇలాంటి గ్రాఫిక్స్ తో సినిమాని రిలీజ్ చేస్తే డిజాస్టర్ గ్యారెంటీ అనే కామెంట్స్ చేశారు. తెలుగు ఆడియన్స్ కూడా ఈ టీజర్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా త్రీడీలో తెరకెక్కుతుంది అనే విషయం తెలిసిందే. కొంత మంది మాత్రం ఆదిపురుష్ టీజర్ త్రీడీ వెర్షన్ లో చూస్తే కచ్చితంగా అభిప్రాయం మారుతుందని చెప్పారు. త్రీడీ విజువల్స్ లో ఇలా మొబైల్ స్క్రీన్స్ లో చూస్తే మొత్తం క్వాలిటీ అవుట్ అయిపోయి కార్టూన్ మూవీ తరహాలోనే కనిపిస్తుంది అని ఆదిపురుష్ ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో, సినిమా సర్కిల్స్ లో వినిపిస్తున్న విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఓం రౌత్ కొంత మంది సినీ విమర్శకులని, జర్నలిస్టులని ప్రత్యేకంగా ఆహ్వానించి త్రీడీలో బిగ్ స్క్రీన్ పై ఆదిపురుష్ టీజర్ ప్రదర్శించి చూపించారు.
వాటికి సంబందించిన విజువల్స్ కూడా షేర్ చేసుకున్నారు. ఒక త్రీడీ వెర్షన్ లో ఆదిపురుష్ టీజర్ చూసిన సినీ జర్నలిస్టులో ట్విట్టర్ లో ఆదిపురుష్ టీజర్ పై తమ అభిప్రాయాలని వ్యక్తం చేశారు. త్రీడీలో టీజర్ చూసిన తర్వాత పూర్తిగా తమ అభిప్రాయాలు మారిపోయాయని చెప్పారు. ఓం రౌత్ అద్భుతంగా ఆవిష్కరించారని పోస్టులు పెట్టారు. కేవలం ఇది త్రీడీలో ఐమ్యాక్స్ ఎక్స్ పీరియన్స్ లో చూస్తే దానిని ఒరిజినాలిటీని ఆశ్వాదించొచ్చు అని చెప్పారు. ఇక ఓం రౌత్ కూడా సినీ జర్నలిస్టులకి ఇదే విషయాన్ని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కేవలం థియేటర్స్ లో త్రీడీ ఎక్స్ పీరియన్స్ కోసం మాత్రమే ఆదిపురుష్ టీజర్ సిద్ధం చేశామని మొబైల్ స్క్రీన్స్ లో చూడటానికి కాదని క్లారిటీ ఇచ్చారు. మీడియాతో కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తుంది.