తెలుగు సిని పరిశ్రమలో సాహసాలు చేయాలి అంటే చాలా ధైర్యం ఉండే ఉండాలి . ముఖ్యంగా ఆ పాత్రలను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అన్న భయం మాత్రం తప్పకుండా ప్రతి హీరో లేదా హీరోయిన్ ల లో ఉంటుంది. కానీ కొన్నిసార్లు వారు చేసే పాత్రల వల్ల వారికి మంచి పేరు కూడా వస్తుందని అని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలోనే బాలకృష్ణ కూడా ఒక అరుదైన సాహసం చేసాడు , ఇండస్ట్రీలో మరింత పాపులారిటీ ని కూడా దక్కించుకున్నారు.. పనే దైవంగా భావించి అంకితభావంతో పనిచేసే అతి కొద్ది మంది నటులలో స్టార్ హీరో లలో బాలకృష్ణ కూడా ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు కూడా చేసుకుంటూ ప్రయోగాలకు కూడా సై అంటూ మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే మాస్ హీరోగా వస్తున్న సమయంలో భైరవద్వీపం లాంటి జానపద చిత్రాన్ని ఎంచుకొని అందరినీ ఆశ్చర్యనికి గురి చేసారు . ఈ సినిమాలో బాలయ్య కురూపిగా నటించడం నిజంగా సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే అప్పటికే గ్లామర్ హీరో లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిపై , కథపై నమ్మకం వుంచి సినిమాను తెరకెక్కించారు. అయితే బాలకృష్ణ ఈ సినిమాలో కురూపిగా కనిపించే సన్నివేశాలు తీయాల్సి వచ్చినప్పుడు ఏకంగా మేకప్ వేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది .
![అలాంటి సాహసం ఒక్క బాలకృష్ణకే సాధ్యం..! 2 అలాంటి సాహసం ఒక్క బాలకృష్ణకే సాధ్యం..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-11T115239.519.jpg)
ఒకసారి మేకప్ వేసిన తర్వాత సాయంత్రం వరకు తీయడానికి వీలు ఉండదు .. భోజనం చేయాలంటే మేకప్ తీయాలి.. మళ్ళీ రెండు గంటల సమయం వృధా అయిపోతుంది , అని ఆలోచించిన ఆయన దాదాపు పది రోజులపాటు కేవలం జ్యూసులు మాత్రమే తీసుకుంటు ఉండే వారట. ఇకపోతే సినిమా సన్నివేశంలో భాగంగా ముళ్ళు కాలిలో దిగబడిపోయి ఎన్నో ఇబ్బందులను ఎదురుకొన్నారు . ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాలో కురూపిగా కనిపిస్తున్న విషయాన్ని థియేటర్లలో సినిమా చూసే వరకు ఎవరికీ తెలియదట . కానీ అభిమానులు ఒక్కసారిగా ఆయనను అలా చూసి ఆశ్చర్యపోయారట.అయితే అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచి ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచిపోయింది. ఇకపోతే ఇలాంటి పాత్రలు చేయడం కేవలం బాలకృష్ణకు మాత్రమే సాధ్యమని చెప్పుకోవచ్చు