పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘భీమ్లా నాయక్’. రానా దగ్గుబాటి మరో హీరోగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. అన్ని చోట్ల ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. టికెట్స్ హాటు కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్ సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా భీమ్లా నాయక్ జోరు కనిపిస్తుంది. ప్రీమియర్ వసూళ్ల తోనే భీమ్లా నాయక్ బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది.
సినీ సర్కిల్స్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు యు.ఎస్లో.. భీమ్లా నాయక్ 325 లొకేషన్స్లో రిలీజ్ కానుంది. ఇన్ని లొకేషన్స్లో ఇప్పటి వరకు 618000 డాలర్స్ను రాబట్టింది. అంటే ప్రీమిర్స్ ద్వారానే నాలుగు కోట్లకు పైగానే ఇప్పటికే భీమ్లా నాయక్ తెచ్చేసాడు. వన్ మిలియన్ వైపు అడుగులేస్తున్నాడు. కరోనా మూడు వేవ్స్ దెబ్బకు తెలుగు సినిమాల ఓవర్ సీస్ మార్కెట్ బాగా దెబ్బతింది. అఖండ, పుష్ప సినిమాలు అక్కడి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే అవి రిలీజ్ తర్వాతనే మంచి వసూళ్లను రాబట్టాయి. కానీ భీమ్లా నాయక్ విషయం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. సినిమా రిలీజ్కు ముందు ప్రీమియర్స్కు ఈరేంజ్ కలెక్షన్స్ రావడం పవర్ స్టార్ స్టామినాకు నిదర్శనమని అంటున్నారు విమర్శకులు. కరోనా తర్వాత బాలీవుడ్ సహా మరే సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ యు.ఎస్లో రాలేదట . మరి భీమ్లా నాయక్ వన్ మలియన్ మార్క్ను చేరుకుటాడో లేదో తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు ఆగాల్సిందే.
మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కళ్యాణ్ ఇందులో పోలీస్ ఆఫీసర్గా.. రాజకీయాల్లో ఎదగాలనుకునే వ్యక్తిగా రానా కనిపించబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. సాగర్ కె.చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ప్లే అందించడంతో పాటు ఓ పాట కూడా రాసారు.