Pawan Kalyan: తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరిన నేపథ్యంలో.. ఒక పార్టీ నుండి మరోపార్టీలోకి మారే నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతకొద్ది కాలంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఆయా పార్టీలను వీడి బీజేపీలోకి చేరుతున్నారు. బీజేపీ నేతలు కూడా వలసలను బాగా ప్రోత్సహిస్తుండటంతో పాటు వారి భవిష్యత్తుకు హామీ ఇస్తుండటంతో ఇది కొనసాగుతోంది.
మునుగోడు ఉప ఎన్నిక కాక కొనసాగుతున్న వేళ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ నేత అయిన దాసోజ్ శ్రవణ్ పార్టీ వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బీజేపీ మునుగోడులో అవలంభిస్తున్న విధానం అస్సలు బాగోలేదని, రాజకీయ మార్పుకు కేరాఫ్ గా నిలుస్తుందనుకున్న పార్టీ ఇలా చేస్తుండటంతో తాను పార్టీ మారబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఆయన టీఆర్ఎస్ లో చేరారు.
బీజేపీ నుండి దాసోజ్ శ్రవణ్ టీఆర్ఎస్ లోకి చేరగా.. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ అంశం మీద పోస్ట్ పెట్టిన జనసేనానిని.. దాసోజు శ్రవణ్ ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడతారని పేర్కొన్నారు. దాసోజు శ్రవణ్ దూరదృష్టి కలిగిన నాయకుడు అని, పార్టీ మార్పు నేపథ్యంలో అభినందనలు తెలియజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Pawan Kalyan:
కాగా అంతకు ముందు దాసోజ్ శ్రవణ్ ప్రజారాజ్యం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టగా.. పార్టీలో మంచి విషయం ఉన్న నాయకుడిగా గుర్తింపు లభించింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేసిన సానిహిత్యంతో పాటు పీఆర్పీ నుండి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ తర్వాత పీర్పీ నుండి టీఆర్ఎస్ లో చేరి, అక్కడి నుండి కాంగ్రెస్ వెళ్లి, అక్కడ రేవంత్ రెడ్డితో పొసగక బీజేపీలోకి చేరారు. ఇప్పుడు తిరిగి టీఆర్ఎస్ లోకి వచ్చారు.
From JanaSena Chief Sri @PawanKalyan :
Congratulations! @sravandasoju is a dynamic & visionary leader. He had joined TRS from PRP just for the cause of Telangana statehood. No matter which party he was in, he fights for the interest of Telangana and its development. (1/2)
— JanaSena Party (@JanaSenaParty) October 21, 2022