జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా ఈ మధ్య వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏదో ఒక సమస్యని తెరపైకి తీసుకొచ్చి వైసీపీ ప్రభుత్వంపై కార్టూన్స్ తో కౌంటర్లు ఇస్తున్నారు. మరో వైపు ప్రజా సమస్యలపై కూడా విస్తృతంగా స్పందిస్తూ వైసీపీ సర్కార్ కి బాధ్యతలని గుర్తు చేస్తున్నారు. జనవాణి పేరుతో ఇప్పటికే ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. వందలాది మంది ప్రజలు ఈ గ్రీవెన్స్ కి వచ్చి వినతులు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జనసేనాని మరో డిజిటల్ కాంపైన్ కి పిలుపునిచ్చారు. ఏపీలో రహదారుల దుస్థితిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి, ప్రభుత్వ వైఫల్యాన్ని చూపించడానికి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ హ్యాష్ ట్యాగ్ తహా ట్విట్టర్ లో డిజిటల్ క్యాంపైన్ నిర్వహించారు.
ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న అధ్వాన రహదారుల దుస్థితిపై ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేయాలని జనసైనికులకి, ప్రజలకి పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో ఏపీలో జనసైనికులు అందరూ ఒక్కసారిగా తమ ప్రతాపం చూపించారు. పవన్ కళ్యాణ్ పిలుపుకి స్పందిస్తూ విస్తృతంగా రోడ్ల దుస్థితిని చూపిస్తూ వీడియోలని ఫోటోలని ట్విట్టర్ లో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ మీద పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. కేవలం జనసైనికులే కాకుండా సామాన్య ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ పిలుపుకి స్పందిస్తూ హ్యాష్ ట్యాగ్ డిజిటల్ క్యాంపైన్ లో భాగస్వామ్యం అయ్యారు. తమ ప్రాంతాలలో అధ్వానంగా రహదారులని ట్విట్టర్ లో వైరల్ చేశారు.
ఈ రోజు ఏపీలో వై.ఎస్. జగన్ వాహన మిత్ర స్కీమ్ డబ్బులు విడుదల చేసిన న్యూస్ ఉన్న కూడా పవన్ కళ్యాణ్ పిలుపుతో జనసైనికులు నిర్వహిస్తున్న ఈ డిజిటల్ క్యాంపైన్ హాట్ టాపిక్ గా మారింది. దాంతో పాటు చర్చనీయాంశంగా మారిపోయింది. గతంలో రోడ్ల సమస్యలపై పవన్ కళ్యాణ్ డిజిటల్ క్యాంపైన్ నిర్వహించగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే స్థాయిలో స్పందన వచ్చింది. ఓ విధంగా ఈ క్యాంపైన్ వైసీపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగానే ఉంది. మరి ఈ క్యాంపైన్ కి వచ్చిన స్పందన పట్ల వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. వర్షాలు పడటం వలన రోడ్లు వేయలేకపోయామని గత ఏడాది చెప్పి తప్పించుకున్న ముఖ్యమంత్రి జగన్ టీమ్ ఈ సారి కూడా అలాంటి విమర్శలనే తెరపైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ పై ఎదురుదాడి చేస్తారేమో చూడాలి.