కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ల పీరియాడిక్ ఓవర్హాలింగ్ (పీఓహెచ్) కేంద్రానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జూలై 12న తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది.
బీజేపీ మహా జన్ సంపర్క్ అభియాన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ప్రధాని జూన్ నెలాఖరులోగా రాష్ట్రానికి రావాల్సి ఉంది. అయితే పార్టీ శ్రేణుల సమాచారం మేరకు ఆయన పర్యటన రద్దయింది. రెండు రోజుల్లో ప్రధాని పర్యటనపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.