కన్నడనాట తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతున్న మూవీ కాంతారా. ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక టచ్ తో చివరి 30నిమిషాల నడిపించిన ఎపిసోడ్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మన మూలాలలో దాగి ఉన్న ఎమోషన్స్ తో ముడిపడిన ఇలాంటి కథలు మరిన్ని ప్రేక్షకుల ముందుకి సినిమాల రూపంలో రావాల్సిన అవసరం ఉందంటూ చాలా మంది సెలబ్రెటీ ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం తాజాగా కాంతారా సినిమాపై ప్రశంసలు కురిపించారు. రిషబ్ శెట్టి ఈ సినిమాని చాలా గొప్పగాతీసాడని ప్రశంసించారు.
ఇందులో ప్రతి క్యారెక్టర్ ని చాలా బాగా ప్రెజెంట్ చేసారని, చివరి 30 నిమిషాలు అయితే గూస్ బాంబ్స్ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పూజా హెగ్డే సైతం ఈ సినిమాపై కామెంట్ చేసింది. ఎమోషనల్ గా మూలాలకి వెళ్లి కథలని రాస్తే ఇలాంటి గొప్ప సినిమాలు వస్తాయని ప్రశంసించింది. తాను చిన్నప్పుడు చూసిన కళారూపాన్ని ఇందులో చూడటం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది.
ఇక ప్రముఖ ఆధ్యాత్మిక గురు సద్గురు తన జీవితంలో చూసిన రెండో సినిమా కాంతారా అని తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇంత మంది ప్రశంసలు అందుకున్న ఈ సినిమాని ఇప్పుడు ఏకంగా దేశ ప్రధాని కూడా చూడటానికి రెడీ అవుతున్నారు. నవంబర్ 14న ప్రత్యేక స్క్రీనింగ్ వేసుకొని ప్రధాని మోడీ కాంతారా సినిమా చూడటానికి రెడీ అవుతున్నారని సమాచారం. నిజంగా దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి కదిలించాడనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. యునానమస్ లో ఈ మూవీకి నేషనల్ అవార్డు ఇచ్చేయొచ్చనే మాట కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది.