సౌత్ ఇండియా దిగ్గజ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా పొన్నియన్ సెల్వన్. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ మూవీని సిల్వర్ స్క్రీన్ పై మణిరత్నం ఆవిష్కరించారు. ఇక త్రిష, ఐశ్వర్య రాయ్ మెయిన్ హీరోయిన్స్ గా చూపించారు. ఇక విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ అయితే సినిమాలో మెయిన్ విలన్ గా కనిపిస్తుంది. సెప్టెంబర్ 30న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బాహుబలి లాంటి హిస్టారికల్ ఫోక్ ఫాంటసీ కథని తెరపై చూసిన కళ్ళతో పొన్నియన్ సెల్వన్ ట్రైలర్ చూస్తే అంతగా రీచ్ కాకపోవచ్చు.
కానీ మణిరత్నం సినిమాలు అంటే ఎక్కువగా కనిపించేది ఎమోషనల్ ఎలిమెంట్స్. ఒక కథలో యాక్షన్ ఎలిమెంట్స్ కంటే ఎమోషనల్ డ్రామాని పండించడంలో ఆయన సిద్ధహస్తుడు. అలాగే పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా ఆయన ఎమోషనల్ ఎలిమెంట్స్ ని ఎక్కువగా టచ్ చేసినట్లు తెలుస్తుంది. చోళ రాజ్యంలో స్వర్ణశకం ఉదయించక మునుపు ఒక తోకచుక్క ఆకాశంలో ఉద్భవించింది. ఆ తోకచుక్క చోళ రాజా కులంలో ఒకరిని బలికోరబోతుంది అనే వాయిస్ ఇంట్రోతో కథని గ్రాండ్ గా స్టార్ట్ చేసి, కథనం ఏంటి అనేది ట్రైలర్ లో చెప్పేసారు. చోళరాజ కులంలో అంతర్గత కుటుంబ విభేదాలు, కుట్రలు. రాజ్యాధికారం జరిగే వెన్నుపోటు వంటి అంశాలని తెరపై ఆవిష్కరించారు.
చియాన్ విక్రమ్ చోళ రాజుగా అతని స్నేహితుడుగా కార్తీ, చోళరాజ రక్షకుడుగా జయం రవి కనిపించారు. ఇక చియాన్ విక్రమ్ ప్రేయసిగా త్రిష పాత్రలు ఉన్నాయి. ఇక రాజ్యాధికారం కోసం కుట్రలకు తెరతీసే రాజమాత తరహా పాత్రలో ఐశ్వర్య రాయ్ కనిపిస్తుంది. ఇలా ట్రైలర్ లో యాక్షన్ ఘట్టాలు ఉన్నా కూడా ఎక్కువగా సినిమా ప్రధాన కథ అంతా చోళరాజ కులంలో జరిగే కుతంత్రాల చుట్టూ ఎమోషనల్ డ్రామాగానే ఆవిష్కరించారు. ట్రైలర్ లో ఖర్చు మొత్తం కనిపిస్తుంది. విజువల్ గ్రాండియర్ గా ఉండటంతో పాటు. చాలా నేచురల్ గా సహజత్వానికి దగ్గరగా గ్రాఫిక్స్ ఉన్నాయి. రెహమాన్ సంగీతం కూడా కథకి తగ్గట్లు యాక్షన్ ఎలిమెంట్స్ కంటే డ్రమాటిక్ గా సాగడం విశేషం. ఓవరాల్ గా బాహుబలి స్థాయిలో లేకున్నా మణిరత్నం స్టైల్, మ్యాజిక్ అయితే స్పష్టంగా పీసీ-1 ట్రైలర్ లో కనిపిస్తుంది.