Poonam Kaur: టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి పూనమ్ కౌర్. ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా పవన్ కళ్యాణ్ వ్యవహారంలో భాగా పాపులర్ అయ్యింది. అన్ని మీడియా సంస్థలు ఆమెకి మంచి ప్రచారం కల్పించాయి. ఏపీలో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పని చేసింది. పంజాబీ ముద్దుగుమ్మ గానే పూనమ్ కౌర్ ని ఇప్పటి అందరూ చూస్తూ ఉంటారు. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి పూనమ్ కౌర్ ని తెరపైకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఆమెతో రిలేషన్ లో ఉన్నారు అంటూ ప్రచారం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించే అవకాశం వస్తే త్రివిక్రమ్ కారణంగా అది పోయిందని ఓ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఆమె తనని తాను పరిచయం చేసుకుంటుంది. పీకే లవ్ అంటూ సోషల్ మీడియా ఆమె వైరల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదిలా ప్రస్తుతం ఈమె సినిమాలు చేయకపోయిన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు రాజకీయాలపై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా విమెన్స్ డే సందర్భంగా గవర్నర్ ఏర్పాటు చేసిన సభలో పూనమ్ కౌర్ పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా మతం పేరు చెప్పి నన్ను తెలంగాణకి దూరం చేస్తున్నారని అన్నారు. సినిమాలలో కూడా అవకాశాలు లేకుండా చేసారని, ఇప్పుడు తెలంగాణ వ్యక్తిని కాదంటూ నన్ను వెలి వేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆమె విమర్శలు చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు.
తాను తెలంగాణలో పుట్టా అని, ఇక్కడే పెరిగానని, నిఖార్సయిన తెలంగాణ బిడ్డని అని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది. ముంబై నుంచి వచ్చిన వాళ్లకి మాత్రమే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కుతున్నాయని, ఇక్కడి అమ్మాయిలని అస్సలు గుర్తించడం లేదని పూనమ్ కౌర్ విమర్శలు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా అన్యాయం జరుగుతుందని పేర్కొంది. ఇప్పటికీ తెలంగాణలోనే దిశా, ప్రీతీ లాంటి అమ్మాయిలకి సంబందించిన సంఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ స్వార్ధం కోసం తనని కూడా అణచివేసే ప్రయత్నం చేసారని ఆమె అన్నారు. ఓ విధంగా పూనమ్ కౌర్ టీఆర్ఎస్ ని లక్ష్యంగా చేసుకొని చేసిన విమర్శలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి.