యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ సినిమా టీజర్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చి అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఒక్క రోజు వ్యవధిలో వంద మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న టీజర్ గా ఇది నిలిచింది. ఇదిలా ఉంటే ఈ టీజర్ ని రెస్పాన్స్ ఏ స్థాయిలో వచ్చిందో అదే స్థాయిలో నెగిటివ్ ప్రచారం కూడా నడుస్తుంది. దానికి దర్శకుడు ఓం రౌత్ ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం అయిత చేశారు. కేవలం త్రీడీ బిగ్ స్క్రీన్ ఫీల్ కోసమే ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేశామని, మొబైల్ స్క్రీన్స్ కోసం కాదని క్లారిటీ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ నార్త్ ఇండియాలో జోరుగా సాగుతున్నాయి. ఈ రోజు ఢిల్లీలో రామ్ లీల మైదానంలో ప్రభాస్ రావణ దహనం వేడుకలో పాల్గొంటాడు. తరువాత హైదరాబాద్ లో కూడా ప్రమోషన్ ఉంటుంది. ఈ ప్రమోషన్స్ లో ప్రభాస్ తో పాటే కృతి సనన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. వీరిద్దరూ ప్రమోషన్స్ లో బాగా క్లోజ్ గా ఉండటం బిటౌన్ మీడియా కంట పడింది. అలాగే అయోధ్యలో టీజర్ రిలీజ్ సమయంలో ప్రభాస్ కి ఉక్కపోత కారణంగా చెమటలు పడితే కృతి సనన్ తన దుప్పట్టా తుడుచోకమని ఇచ్చింది.
దానికి సంబందించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ నేపధ్యంలో ప్రభాస్, కృతి సనన్ మధ్య ఏదో నడుస్తుంది అనే ప్రచారం తెరపైకి తీసుకొచ్చారు. కృతి సనన్ ప్రభాస్ ని ఇష్టపడుతుంది అని టాక్ ఇప్పుడు బిటౌన్ లో వినిపిస్తుంది. ప్రభాస్ వ్యక్తిత్వానికి, ఆలోచనలకి ఆమె కనెక్ట్ అయిపోయిందని, అందుకే అతనితో అంత క్లోజ్ గా మూవ్ అవుతుందనే మాట బిటౌన్ మీడియా ప్రచారం చేస్తుంది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది అనేది వారే తెలియజేయాలి.