ఆదిపురుష్ సినిమా చుట్టూ ఇప్పుడు వివాదాలు అలుముకున్నాయి. హిందుత్వ వాదులు, సంఘాలు ఆదిపురుష్ సినిమాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సినిమా కథాంశం పూర్తిగా వక్రీకరించారని ఆరోపణలు చేస్తున్నారు. కొంత మంది అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేశారు. సినిమాని తక్షణమే ఆపాలని, మార్పులు చేసి హిందువుల విశ్వాసాలకి లోబడి తీయాలని సూచిస్తున్నారు. ఏ పాత్రలని కూడా రామాయణంలో చెప్పబడిన విధంగా దర్శకుడు ఆదిపురుష్ సినిమాలో చూపించలేదని టీజర్ తో అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇదిలా ఉంటే ఓ వైపు ఈ సినిమా వివాదాలు చుట్టూముడుతూ ఉంటే చిత్ర యూనిట్ మాత్రం అవుట్ ఫుట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది.
ఒక ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి దర్శకుడు ఓం రౌత్, రైటర్ మనోజ్ సిద్ధం అయ్యారు. అసలు తాము ఎలాంటి ఆలోచనతో ఆదిపురుష్ సినిమాని తెరకెక్కించింది మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు.ఈ జెనరేషన్ కి చేరువ చేయడానికి రామాయణం కథని హాలీవుడ్ యాంగిల్ లో మర్వెల్ సిరీస్ ల తరహాలో చూపించబోతున్నామని, అలాగే కంటెంట్ ని ఎక్కడా కూడా వక్రీకరించలేదని, ఒక నిమిషం టీజర్ తో ఒక నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇక ఆదిపురుష్ త్రీడీ టీజర్ ని ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాలలో 60కి పైగా థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే త్రీడీ టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. సినిమా త్రీడీలో చూస్తున్నప్పుడు తాను చిన్నపిల్లాడిని అయిపోయానని చెప్పాడు. అద్భుతంగా విజువల్ ఫీస్ట్ గా ఆదిపురుష్ మూవీ ఉండబోతుందని చెప్పేసాడు. అలాగే త్వరలో మరొక బ్యాంగ్ ఆదిపురుష్ మూవీ నుంచి ఉండబోతుంది అని, ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చితుందని చెప్పేశాడు. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చూడని విధంగా ఆదిపురుష్ ని చూపించబోతున్నాం అన్నారు. ఇక ప్రభాస్ మాటల్లో ఈ సినిమాపై వివాదాలు వచ్చిన తగ్గేదిలే అన్నట్లుగా కాన్ఫిడెన్స్ కనిపించడం విశేషం.