యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా 400 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమాని టి-సిరీస్ భూషణ్ కుమార్ నిర్మించారు. ఇదిలా ఉంటే ఆదిపురుష్ టీజర్ తో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక చిత్ర యూనిట్ మొత్తం ఇప్పుడు ప్రమోషన్ యాక్టివిటీస్ లో ఉంది. ఇక ఇందులో భాగంగా మొదటి సారి సౌత్ ఇండియా నుంచి ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే రావణ దహనం కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని రెబల్ స్టార్ ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన ఈ వేడుకలో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారు.
Jai Shree Ram.. Raja Ram.. #Prabhas 🏹 pic.twitter.com/qYFLgIn2y5
— ִֶָ (@charanvicky_) October 5, 2022
అలాంటి వేడుకలో పాల్గొనే అరుదైన అవకాశం ప్రభాస్ కి రావడమే కాకుండా అతని చేతుల మీదుగానే రావణ దహనం జరగడం ఇంకా ప్రత్యేకంగా అనిపించింది. ఆదిపురుష్ సినిమా కారణంగా ప్రభాస్ కి ఈ అరుదైన అవకాశం సొంతం అయ్యిందని చెప్పాలి. ఇక ఈ వేడుకలో భాగంగా ప్రభాస్ విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని వదిలి రావణ దహనం నిర్వహించారు. ఇక లక్షలాది మంది పాల్గొన్న ఈ వేడుకలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలవడం విశేషం. అశేష జనవాహిని ఈ రామ్ లీల మైదానంలో ప్రభాస్ ని చూసేందుకు ఆసక్తి చూపించారు. ఇక ఈ సినిమా నెక్స్ట్ ప్రమోషన్ లో భాగంగా ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. అలాగే అదే రోజు సినీ జర్నలిస్టులకి టీజర్ ని త్రీడీషోలో సిల్వర్ స్క్రీన్ పై కూడా చూపించబోతున్నారు అని తెలుస్తుంది.