సౌత్ ఇండియా నుంచి మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ తో తెరకెక్కిన సాహూ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అలాగే రాధేశ్యామ్ మూవీ కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కి ఊహించని స్థాయిలో ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఫ్లాప్ టాక్ తో కూడా ఈ మూవీ ఏకంగా 450 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అంటే ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే మారుతి దర్శకత్వంలో ఒక మూవీ ఫైనల్ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. వీటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ షూటింగ్ దశలో ఉంది.
రామాయణం కథాంశంతో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె మూవీ అయితే పాన్ వరల్డ్ రేంజ్ లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా ప్రభాస్ ఉన్నాడు. ఒక్కో సినిమాకి అతను వంద కోట్లకి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం ఆరువందల కోట్ల వరకు అతని సినిమాలతో ఆర్జిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. సినిమాలలో హీరోగా చేస్తూనే ప్రభాస్ కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నట్లు టాక్ నడుస్తుంది.
హోటల్ బిజినెస్ లోకి ప్రభాస్ దిగుతున్నాడని సమాచారం. తన హోటల్ ఇండస్ట్రీని ఇండియన్ వైడ్ తో పాటు స్పెయిన్, దుబాయ్ లో కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపుబిజినెస్ మెన్ గా తన ఫ్యూచర్ ప్లాన్ ని ప్రభాస్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యాపార పనులని తన ఫ్రెండ్స్, తన టీమ్ కలిసి మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఓ వైపు భారీ ప్రాజెక్ట్ లని చేతిలో పెట్టుకొని మరో వైపు ఇలా హోటల్ వ్యాపారంలోకి దిగడంతో దారా పాన్ వరల్డ్ రేంజ్ లో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రభాస్ సిద్ధం అవుతున్నాడు.