రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మూవీ తో పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ కావడంతో దాదాపు ఆ మార్కెట్ ఇప్పుడు లేదని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం సలార్ . ఈ సినిమా కోసం అభిమానులే కాదు ఇండస్ట్రీ కూడా ఈ మూవీ పైన ఆశలు పెట్టుకుంది. మరి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తుండగా విడుదలకు ముందే షారుఖ్ ఖాన్ ని డామినేట్ చేసేలా ఉండడం గమనార్హం అని అన్నారు .
అసలు విషయంలోకి వెళితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం సలార్ . సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రభాస్ వంటి గ్లోబల్ మార్కెట్ లో ఉన్న హీరోతో కేజిఎఫ్ వంటి సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూవీ అనే సరికి అంత ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు సెప్టెంబర్ లో వస్తున్న భారీ సినిమా జవాన్. చాలా ఏళ్ల తర్వాత పఠాన్ తో సంచనాలు క్రియేట్ చేసిన షారుక్ ఇప్పుడు జవాన్ మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు.
ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇకపోతే మొదటి రోజే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మిలియన్ డాలర్లను అధిగమిస్తుంది అనే వార్తలు కూడా వినిపిస్తుండగా.. ఇప్పుడు ఆ రికార్డునే డామినేట్ చేయడానికి సలార్ ముందుకు వచ్చింది. ఈమూవీ విడుదల ఇంకా నెల రోజులు ఉన్నా.. ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ కాగా అడ్వాన్స్ బుకింగ్ లో నాలుగు లక్షల డాలర్లు దాటిందంట . జవాన్ కంటే నెల రోజులకు విడుదల కావాల్సిన సలార్ అడ్వాన్స్ బుకింగ్ లో కూడా డబుల్ ఉండడం విశేషం అంటుంది. మొత్తానికైతే షారుక్ ఖాన్ పై ప్రభాస్ స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు .