Priyamani : ఇండస్ట్రీలో ఈ మధ్య విడాకుల వార్తలకు ఏమాత్రం కొదువ లేకుండా పోతోంది. నిజంగా కొన్ని జంటలు విడాకుల బాట పడుతుంటే.. మరికొన్ని జంటలపై వస్తున్నవి రూమర్స్ గానే కనిపిస్తున్నాయి. మంచు మనోజ్ జంట, నాగ చైతన్య, సమంత జంట, ధనుష్, సౌందర్య రజినీకాంత్ వంటి జంటల విడాకుల విషయం ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించింది. ఇటీవలి కాలంలో ప్రముఖ సింగర్స్ జంట హేమచంద్ర, శ్రావణ భార్గవి సైతం విడాకులు తీసుకోబోతున్నారంటూ టాక్ నడిచింది. తాజాగా రానా, మిహికల జంట గురించి కూడా ఈ రూమర్ వినిపించింది. యంగ్ కపుల్స్ నుండి..సీనియర్ హీరోల వరకు అందరూ ఇలా విడాకులు తీసుకుంటూ షాక్ ఇస్తునారు.
ఇప్పటికే బిగ్ స్టార్స్ అందరూ తమ విడాకుల విషయం ప్రకటించి అభిమానుల గుండెలు బద్ధలు చేయగా..ఇప్పుడు అందాల తార ప్రియమణి కూడా ఇదే లిస్ట్ లోకి చేరిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రియమణి గురించి వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియడం లేదు కానీ టాక్ మాత్రం బలంగానే వినిపిస్తోంది. ప్రియమణి..ముస్తఫా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక్కడ షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే..ఆయనకు ఆల్ రెడీ పెళ్ళి అయ్యింది. ఆ తరువాతే ప్రియమణితో లవ్.. ఆపై పెళ్లి చకచకా జరిగిపోయాయి.ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రియమణి పైన్ కేసు కూడా పెడతామని మొదటి భార్య బెదిరించింది. అయినా కూడా ప్రియమణి ఏ మాత్రం లొంగ లేదు భయపడలేదు.
Priyamani : ప్రియమణి దంపతుల మధ్య ఆ కారణంగా గొడవలు..
ప్రస్తుతం ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే పలు టీవీ షోలలో జడ్జిగా సైతం దర్శనమిస్తోంది. ఇక సినిమాల్లోనూ మంచి మంచి ఆఫర్స్ పడుతూ ప్రియమణి ముందుకు వెళుతోంది. మరోవైపు పలు వెబ్ సిరీస్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా కాలం వెళ్లదీస్తోంది. అయితే ప్రియమణి దంపతులకు పెళ్లై చాలా కాలం అవుతున్నా కూడా పిల్లలు లేరు. కెరీర్ ప్రస్తుతం మంచి జోష్లో ఉందని.. ఈ తరుణంలో పిల్లలు వద్దని ప్రియమణి అవాయిడ్ చేస్తోందట. ఈ కారణంగానే ప్రియమణి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు టాక్ నడుస్తోంది. దీంతో ప్రియమణి తన వివాహ బంధానికి బ్రేక్ వేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై ప్రియమణి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.