పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఎ.ఎం.రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యింది. మరో 30 శాతం షూటింగ్ పార్ట్ పెండింగ్ లో ఉంది. నవంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షెడ్యుల్ స్టార్ట్ చేసి డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని క్రిష్ భావిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానికి రంగం సిద్ధం అయ్యింది.
రీసెంట్ గా వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకి పాజిటివ్ బజ్ ఉన్న నిర్మాతకి మాత్రం కొత్త టెన్సన్ మొదలైంది. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ రెట్లుని ఏపీ ప్రభుత్వం అమాంతం తగ్గించేసింది. కొత్త జీవో తీసుకొచ్చి రాత్రికి రాత్రి సినిమా టికెట్ రెట్లు తగ్గించి ప్రజలపై భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ సినిమా థియేటర్స్ నుంచి వెళ్లిపోయేంత వరకు ఏపీ ప్రభుత్వం ఆ జీవో కొనసాగించింది.
తరువాత చిరంజీవి, రాజమౌళి, మహేష్ లాంటి వారు వెళ్లి కావడంతో మళ్ళీ టికెట్ రెట్లపై కొత్త స్లాబ్ విధానం తీసుకొచ్చింది. ఇక హరిహర వీరమల్లు సినిమాని మార్చిలో రిలీజ్ చేయడానికి క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ రిలీజ్ ని అడ్డుకునే ప్రయత్నం వైసీపీ సర్కార్ చేయకపోయినా ఏదో ఒక పెట్టి ప్రదర్శనలకి ఆటంకం కలిగించే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అదే జరిగితే నిర్మాత, డిస్టి బ్యూటర్స్ దారుణంగా నష్టపోతారు. పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో నిర్మాతలకి నష్టం కలిగించే పనిని వైసీపీ సర్కార్ చేసే అవకాశం ఉందని ఇప్పుడు ఏఎం రత్నం భయపడుతున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నమాట.