Puri Jaganath: టాలీవుడ్ మాస్ ప్రేక్షకులకు మాస్ హీరోలను అందించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇప్పుడు స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న హీరోలు అందరితోను భారీ హిట్లు తీసాడు. ఇక పూరితో తమ ఫెవరెట్ హీరో సినిమా చేస్తున్నాడు అంటే ఆ హీరో అభిమానులకు అది పండగే. తనదైన ముద్ర వేస్తూ హీరోలను స్పెషల్ గా చూపించడంలో పూరి స్టయిలే వేరు. అలా టాలీవుడ్ ను షేక్ చేసే హిట్లు అందించిన పూరీ మంచి మాస్ దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు.
“దేశముదురు”తో అల్లు అర్జున్ను మాస్ స్టార్ గా తీర్చిదిద్దింది, మహేష్ బాబును “పోకిరి”తో సూపర్ స్టార్గా మార్చింది, “బద్రి”తో పవన్ కళ్యాణ్ కు క్రేజీ ఫాలోయింగ్ తెచ్చింది పూరి జగన్నాథే. ఇక రవితేజకు అయితే “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం”, “ఇడియట్”, “అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి” వంటి సినిమాలతో మంచి హిట్స్ అందించాడు. ఇంకా ఊర మాస్ సినిమాలతో, టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్న పూరి.. ఈ మధ్య సరైన హిట్ మూవీ లేక కాస్త ఇబ్బంది పడుతున్నాడు.
ఇక “ఇస్మార్ట్ శంకర్”, “లైగర్” వంటి సినిమాలలో బాగా గ్రౌండ్ వర్క్ చేసినా హిట్ అందుకోలేకపోయాడు పూరి. అయితే తన దర్శక ప్రతిభ కాస్త తగ్గిందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. నటనలో రాణిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల విడుదలైన మెగాస్టార్ “గాడ్ ఫాదర్” సినిమాలో జర్నలిస్టుగా మంచి పాత్ర పోషించాడు. కేవలం ఆ పాత్ర చేయడమే కాకుండా.. ఆ సినిమాలో కథను వివరించేది కూడా పూరీనే. ఇలా గాడ్ ఫాదర్ లో రెండు రకాలుగా మెప్పించాడు. అయితే ఆ మధ్య పూరి చేసిన పాడ్ కాస్ట్ లు విని.. మురిసిపోయిన చిరంజీవి, గాడ్ ఫాదర్ సినిమా నరేట్ చేసే బాధ్యతను పూరికి ఇప్పించాడని అప్పట్లో మెగాస్టార్ తెలిపాడు.
Puri Jaganath:
అంతే కాక ఇటీవల “ఓరి దేవుడా” సినిమాలో ఒక క్యామియో రోల్ చేశాడు పూరి. అయితే ఈ పాత్ర తన నిజ జీవితానికి దగ్గరగా ఉండడం విశేషం. ఆ సినిమాలో ఆడిషన్స్ కోసం వచ్చిన విశ్వక్ సేన్ ని టెస్ట్ చేసి చూస్తాడు పూరి జగన్నాథ్. అంతకంటే ముందు పూరీనే స్టోరీని నరేట్ చేసాడు. పూరి చేసిన పాడ్ కాస్ట్ లకు మంచి ఆదరణ లభించడమే కాకుండా తనకు మంచి అవకాశాలను తెచ్చిపెడుతుందని మాట్లాడుకుంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఏదేమైనా పూరి ఇలా కూడా అభిమానులని ఆకట్టుకుంటుండం విశేషం.